విధాత, ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్టకు వచ్చే భక్తులకు సులభతర సేవలు అందించేందుకు అధికారులు ఆన్లైన్ విధానాన్ని అందుబాటులోకి తెచ్చారు. దీంతో అన్నిరకాల సేవలను మొబైల్లోనే బుకింగ్స్ చేసుకోవచ్చు.
yadadritemple.telangana.gov.inలో భక్తులు తమకు కావాల్సిన సేవలను పొందవచ్చు. కాగా తిరుమల తిరుపతి తరహాలో యాదగిరిగుట్ట అధికారులు కూడా ఇటీవల బ్రేక్ దర్శనం టికెట్లను తీసుకొచ్చారు.