ముగిసిన రాహుల్ గాంధీ.. భార‌త్ జోడో యాత్ర‌

విధాత: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ క‌న్యాకుమారి నుంచి క‌శ్మీర్ దాకా చేప‌ట్టిన 4,080 కిలోమీట‌ర్ల భార‌త్ జోడో యాత్ర ముగిసింది. ప్రియాంకాగాంధీ, మ‌హ‌బూబా ముఫ్తీ త‌దిత‌ర నేత‌ల స‌మ‌క్షంలో క‌శ్మీర్‌లోని లాల్ చౌక్‌లో రాహుల్ గాంధీ త్రివ‌ర్ణ ప‌తాకాన్ని ఆవిష్క‌రించారు. దేశంలో ద‌క్షిన కొస‌నుంచి ఉత్త‌రాదిన ఉన్న క‌శ్మీర్ దాకా 134 రోజుల పాటు వివిధ రాష్ట్రాల్లోని 75 జిల్లాల గుండా ఈ యాత్ర గ‌త ఏడాది సెప్టెంబ‌ర్ 7న క‌న్యాకుమారిలో ప్రారంభ‌మై నేటితో (జ‌న‌వ‌రి […]

  • Publish Date - January 29, 2023 / 04:50 PM IST

విధాత: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ క‌న్యాకుమారి నుంచి క‌శ్మీర్ దాకా చేప‌ట్టిన 4,080 కిలోమీట‌ర్ల భార‌త్ జోడో యాత్ర ముగిసింది. ప్రియాంకాగాంధీ, మ‌హ‌బూబా ముఫ్తీ త‌దిత‌ర నేత‌ల స‌మ‌క్షంలో క‌శ్మీర్‌లోని లాల్ చౌక్‌లో రాహుల్ గాంధీ త్రివ‌ర్ణ ప‌తాకాన్ని ఆవిష్క‌రించారు.

దేశంలో ద‌క్షిన కొస‌నుంచి ఉత్త‌రాదిన ఉన్న క‌శ్మీర్ దాకా 134 రోజుల పాటు వివిధ రాష్ట్రాల్లోని 75 జిల్లాల గుండా ఈ యాత్ర గ‌త ఏడాది సెప్టెంబ‌ర్ 7న క‌న్యాకుమారిలో ప్రారంభ‌మై నేటితో (జ‌న‌వ‌రి 29) ముగిసింది. భార‌త్ జోడో యాత్ర ముగింపు స‌మావేశంలో మాట్లాడుతూ.. ప్ర‌తిప‌క్షాల మ‌ధ్య ఎన్ని విభేదాలున్నా.. ఆర్ ఎస్ఎస్‌, బీజేపీల‌ను ఎదుర్కోవ‌టంలో క‌లిసి న‌డుస్తామ‌ని ప్ర‌క‌టించారు.

జోడో యాత్ర సంద‌ర్భంగా.. దేశ ప్ర‌జ‌ల ఆద‌రాభిమానాల‌ను ప్రేమ‌ను చ‌విచూశాన‌ని రాహుల్‌గాంధీ అన్నారు. దేశంలోని భిన్న వ‌ర్గాల ప్ర‌జ‌ల‌ను నేరుగా క‌లిసి మాట్లాడే అవ‌కాశం ద‌క్కింద‌నీ, వారి క‌ష్ట‌, సుఖాల‌ను ప్ర‌త్య‌క్షంగా చూశాన‌ని రాహుల్ తెలిపారు. ఆ క్ర‌మంలోనే ప్ర‌ధానంగా రైతులు, నిరుద్యోగుల ఆకాంక్ష‌ల‌ను, స‌మ‌స్య‌లు త‌న‌తో పంచుకున్నార‌ని చెబుతూ.. వారి స‌మ‌స్య‌ల ప‌రిష్కారం కోసం తాము పాటుప‌డ‌తామ‌ని ప్ర‌క‌టించారు.

Latest News