South central railway | ప్రయాణికులకు అలెర్ట్‌..! ఆ మార్గాల్లో 21న భారీగా రైళ్లను రద్దు చేసిన దక్షిణ మధ్య రైల్వే..!

South central railway | హైదరాబాద్‌ నుంచి పలు మార్గాల్లో నడిచే రైళ్లను దక్షిణ మధ్య రైల్వే రద్దు చేసింది. ఈ మేరకు ప్రకటనను విడుదల చేసింది. చర్లపల్లి - ఘట్‌కేసర్‌ మార్గంలో మరమ్మతుల కారణంగా ఆయా రైళ్లను ఈ నెల 21న రద్దు చేస్తున్నట్లు తెలిపింది. సికింద్రాబాద్‌ - వరంగల్‌, సికింద్రాబాద్‌ - వరంగల్‌ మార్గాల్లో నడిచే రైళ్లు ఉన్నాయి. వరంగల్ - సికింద్రాబాద్‌, సికింద్రాబాద్ - వరంగల్, వరంగల్ - హైదరాబాద్, హైదరాబాద్ - […]

  • Publish Date - May 19, 2023 / 02:36 AM IST

South central railway | హైదరాబాద్‌ నుంచి పలు మార్గాల్లో నడిచే రైళ్లను దక్షిణ మధ్య రైల్వే రద్దు చేసింది. ఈ మేరకు ప్రకటనను విడుదల చేసింది. చర్లపల్లి – ఘట్‌కేసర్‌ మార్గంలో మరమ్మతుల కారణంగా ఆయా రైళ్లను ఈ నెల 21న రద్దు చేస్తున్నట్లు తెలిపింది.

సికింద్రాబాద్‌ – వరంగల్‌, సికింద్రాబాద్‌ – వరంగల్‌ మార్గాల్లో నడిచే రైళ్లు ఉన్నాయి. వరంగల్ – సికింద్రాబాద్‌, సికింద్రాబాద్ – వరంగల్, వరంగల్ – హైదరాబాద్, హైదరాబాద్ – కాజీపేట్, మిర్యాలగూడ – నడికుడ, నడికుడ – మిర్యాలగూడ, మిర్యాలగూడ – కాచిగూడ, సికింద్రాబాద్ – రేపల్లె, గుంటూరు – వికారాబాద్, వికారాబాద్ – గుంటూరు, హైదరాబాద్ – సిర్పూర్ కాగజ్ నగర్, సిర్పూర్ కాగజ్ నగర్ – హైదరాబాద్‌, సికింద్రాబాద్ – గుంటూరు, గుంటూరు – సికింద్రాబాద్, సికింద్రాబాద్ – సిర్పూర్ కాగజ్ నగర్ రైళ్లను రద్దు చేసినట్లు తెలిపింది.

ఆ రూట్‌లో ప్రత్యేక రైళ్లు..

వేసవి ప్రయాణికుల రద్దీ నియంత్రణ కోసం సికింద్రాబాద్‌ నుంచి దానాపూర్‌, దిబ్రూగఢ్‌కు ప్రత్యేక రైళ్లను నడిపిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ నుంచి బిహార్‌లోని దానాపూర్‌కు, అసోంలోని దిబ్రూగడ్‌కు రైళ్లు నడువనున్నట్లు పేర్కొంది. సికింద్రాబాద్‌-దానాపూర్‌ మధ్య (రైలు నంబర్ 07419) ఈ నెల 20, 27 తేదీల్లోసాయంత్రం 3.15కి బయల్దేరి ఆదివారం రాత్రి 11.15 గంటలకు దానాపూర్‌ చేరుకుంటుంది.

దానాపూర్‌-సికింద్రాబాద్‌ మధ్య ( రైలు నంబరు 07420 మే 22, 29) తేదీల్లో నడవనున్నది. ప్రతి సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు బయలుదేరి.. మంగళవారం రాత్రి 11.50కి సికింద్రాబాద్‌ చేరుకుంటుంది. ఈ రైళ్లు రెండు వైపులా కాజీపేట, పెద్దపల్లి, బెల్లంపల్లి, సిర్పూర్‌ కాగజ్‌నగర్‌, బల్హార్ష నాగ్‌పుర్‌, ఇటార్సి, పిపారియా, జబల్‌పూర్‌, కట్ని, సత్నా, ప్రయాగ్‌రాజ్‌, పండిట్‌ దీన్‌దయాళ్‌ ఉపాధ్యాయ, బక్సర్‌ రైల్వే స్టేషన్లలో ఆగుతుంది.

ఇక సికింద్రాబాద్‌-దిబ్రూగఢ్‌ మధ్య ( రైలు నంబరు 07046) ఈ నెల 22, 29 తేదీల్లో నడవనున్నాయి. ప్రతి సోమవారం ఉదయం 11 గంటలకు బయలుదేరి బుధవారం రాత్రి 8.50కి దిబ్రూగఢ్‌ చేరుకుంటుంది. దిబ్రూగఢ్‌-సికింద్రాబాద్‌ మధ్య ( రైలు నంబర్ 07047) మే 18, 25, జూన్‌ 1 తేదీల్లో నడుస్తుంది. ప్రతి గురువారం ఉదయం 9.20 గంటలకు బయలుదేరి రైలు శనివారం సాయంత్రం 4.30 గంటలకు సికింద్రాబాద్‌ చేరుకుంటుంది.

రెండు వైపులా ప్రయాణాల్లో రైలు నల్గొండ, మిర్యాలగూడ, గుంటూరు, విజయవాడ, ఏలూరు, రాజమహేంద్రవరం, సామర్లకోట, దువ్వాడ, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, పలాస స్టేషన్లలో ఆగుతాయి. భువనేశ్వర్‌, కటక్‌, న్యూజల్పాయ్‌గురి, గుహవాటి మీదుగా సికింద్రాబాద్‌-దిబ్రూగఢ్‌కు చేరుకుంటుందని దక్షిణ మధ్య రైల్వే వివరించింది.

Latest News