విధాత: యాదగిరిగుట్ట పుణ్యక్షేత్రంలో వాహన పూజలో భాగంగా చాపర్( హెలికాప్టర్)కు ప్రత్యేక పూజలు నిర్వహించిన విశేషం చోటు చేసుకుంది.
ప్రతిమ మెడికల్ కళాశాల ఎండీ, ప్రతిమ గ్రూప్సు అధినేత బోయినపల్ల్ శ్రీనివాసరావు కొనుగోలు చేసిన చాపర్(హెలీకాప్టర్)కు శ్రీలక్ష్మీనరసింహుని ఆశీస్సులు కోరుతూ యాదగిరిగుట్ట హెలిపాడ్ వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజల అనంతరం చాపర్తో గిరి ప్రదక్షిణ చేశారు. పూజా కార్యక్రమాల్లో కంపెనీ ప్రతినిధి బోయినపల్లి శ్రీనివాసరావు, మహారాష్ట్ర మాజీ గవర్నర్ సిహెచ్. విద్యాసాగర్ రావు పాల్గొన్నారు.