Telangana | గిరిజనులకు గుడ్‌న్యూస్‌.. 30 నుంచి పోడు పట్టాలు పంపిణీ

Telangana | విధాత: రాష్ట్రంలో ఈ నెల (జూన్) 30 వ తేదీ నుంచి గిరిజనులకు పోడు భూముల పట్టాలను పంపిణీ చేయాలని ముఖ్యమంత్రి శ్రీ కె.చంద్రశేఖర్ రావు గారు నిర్ణయించారు. పోడు పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని ఆసిఫాబాద్ జిల్లా కేంద్రం నుండి అదే రోజు (జూన్ 30) న సీఎం కేసీఆర్ గారు లాంఛనంగా ప్రారంభించనున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు వారి వారి జిల్లాలు, నియోజకవర్గాల్లో అదే రోజు పోడు పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా చేపట్టనున్నారు. […]

  • Publish Date - June 24, 2023 / 12:49 PM IST

Telangana |

విధాత: రాష్ట్రంలో ఈ నెల (జూన్) 30 వ తేదీ నుంచి గిరిజనులకు పోడు భూముల పట్టాలను పంపిణీ చేయాలని ముఖ్యమంత్రి శ్రీ కె.చంద్రశేఖర్ రావు గారు నిర్ణయించారు.

పోడు పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని ఆసిఫాబాద్ జిల్లా కేంద్రం నుండి అదే రోజు (జూన్ 30) న సీఎం కేసీఆర్ గారు లాంఛనంగా ప్రారంభించనున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు వారి వారి జిల్లాలు, నియోజకవర్గాల్లో అదే రోజు పోడు పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా చేపట్టనున్నారు.

కాగా.. ఈ నెల 24 నుంచే పోడు భూముల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించాలని ప్రకటించినప్పటికీ కొన్ని అనివార్య కారణాల చేత ఈ నెల 30 తేదికి మార్చవలసి వచ్చింది.

జాతీయ ఎన్నికల కమిటీ రాష్ట్రంలో పర్యటిస్తుండడం, అందుకు సంబంధించి నిన్న, ఇవ్వాళ జిల్లా కలెక్టర్లకు శిక్షణా తరగుతులు నిర్వహిస్తుండడం, అదే సందర్భంలో ఈ నెల 29 న బక్రీద్ పండుగ కూడా వుండడం… వీటన్నిటి నేపథ్యంలో ప్రకటించిన కార్యక్రమాన్ని జూన్ 30కి మార్చడం జరిగింది.

Latest News