Site icon vidhaatha

కేంద్ర బడ్జెట్‌లోని ముఖ్యాంశాలివే..

విధాత‌: 2023-24 ఆర్థిక సంవత్సరానికి గాను కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ బుధవారం లోక్‌సభలో ప్రవేశపెట్టారు. అనంతరం బడ్జెట్‌పై ఆమె ప్రసంగిస్తూ..అమృత కాలంలో ఇది తొలి బడ్జెట్‌. అన్నివర్గాల సంక్షేమమే లక్ష్యంగా ఈ బడ్జెట్‌ ప్రవేశపెడుతున్నాం. అమృతకాల విజన్‌ను మంత్రి వివరిస్తూ.. 2047 లక్ష్యంగా పథకాలు రూపొందిస్తున్నాం. ప్రపంచంలో అత్యధికంగా 7 శాతం వృద్ధి రేటు ఉన్న ఆర్థిక వ్యవస్థ మనది. సామాజిక భద్రత, డిజిటల్‌ పేమెంట్లలో చక్కటి వృద్ధి సాధించాం.సామాన్యుల సాధికారతకు ఈ బడ్జెట్‌ దోహదపడుతుందని ఆర్థిక మంత్రి చెప్పారు.

వేత‌న జీవుల‌కు ఊర‌ట‌.. ఆదాయ పరిమితి రూ.7 ల‌క్ష‌లకు పెంపు

యువత,మహిళలు, ఎస్సీ, ఎస్టీ, బలహీనవర్గాలకు ఈ బడ్జెట్‌ ఆశాదీపం అన్నారు. ఈ బడ్జెట్‌ ఆర్థిక వృద్ధి రేటు 7శాతంగా ఉంటుందని అంచనా వేస్తున్నాం. కొవిడ్‌ కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక ప్రగతి మందిగిస్తే భారత్‌ మాత్రం పురోగమించింది. పూర్వ బడ్జెట్‌లు నిర్మించిన పునాదులపై ఈ బడ్జెట్‌ సమర్పిస్తున్నామని తెలిపారు.

కరోనా సమయంలోపీఎం గరీబ్‌ కల్యాణ్‌ అన్నయోజన పథకం కింద 80 కోట్ల మందికి ఉచితంగా ఆహార ధాన్యాలు సరఫరా చేశాం. ఈ ఏడాది కూడా అది కొనసాగింది. స్థిరీకరణతో కూడిన అభివృద్ధి దిశగా భారత్‌ అడుగులు వేస్తున్నది. దేశ తలసరి ఆదాయం రెట్టింపు అయ్యింది. భారత్‌ ఐదో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలిచింది. వంద కోట్ల మందికి 220 కోట్ల వ్యాక్సిన్‌ డోసులు అందించాం. మన దేశ ఆర్థిక వ్యవస్థ సరైన దారిలోనే పయనిస్తున్నది.

కేంద్ర బడ్జెట్‌లోని ముఖ్యాంశాలు ఇవే..

ధరలు తగ్గేవి: టీవీలు, కెమెరాలు, మొబైల్స్‌, లిథియం బ్యాటరీ

ధరలు పెరిగేవి: సిగరెట్లు, వెండి, బంగారం, వజ్రాలు, టైర్లు, రెడీమేడ్‌ వస్త్రాలు,

12 పైస‌లు పెరిగిన రూపాయి విలువ‌

Exit mobile version