విధాత : మంత్రి ఎన్. ఉత్తమ్కుమార్రెడ్డి బుధవారం ఢిల్లీకి వెళ్లి స్పీకర్ ఓం బిర్లాను కలిసి తన ఎంపీ పదవికి రాజీనామా చేశారు. ఆయన హుజూర్నగర్ కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా బాధ్యతలు చేపట్టడంతో ఎంపీ పదవికి రాజీనామా చేయాల్సివచ్చింది.
అనంతరం ఉత్తమ్ కుమార్రెడ్డి తన సతీమణి కోదాడ ఎమ్మెల్యే ఎన్. పద్మావతితో కలిసి కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, రాహుల్ గాంధీలతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఉత్తమ్ మాట్లాడుతూ ఎంపీ పదవికి రాజీనామా చేశానని, అలాగే మర్యాద పూర్వకంగానే సోనియాగాంధీ, రాహుల్గాంధీలను కలువడం జరిగిందని, వారితో ఎలాంటి రాజకీయాలు చర్చించలేదన్నారు.