విధాత: యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి అధ్యయనోత్సవాల్లో భాగంగా గురువారం ఉదయం స్వామివారు శ్రీ వెన్నకృష్ణుడి(నవనీత చోరుడు) అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు.
సాయంత్రం ఖాళీయ మర్దనుడి అవతార అలంకార సేవలో భక్తులకు ఆశ్రిత రక్షకుడిగా దర్శనమిచ్చి పులకింప చేశారు. స్వామివారి అధ్యయనోత్సవాల్లో, నిత్య పూజలలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని తరించారు.