Vidhaatha | విధాత ఈ-పేపర్‌ ఆవిష్కరణ

Vidhaatha | విధాత: విధాత డిజిటల్‌ మీడియా నుంచి ఈ-పేపర్‌, నవీకరించిన వెబ్‌సైట్‌, స్టూడియోలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. సీనియర్‌ పాత్రికేయులు, ఏపీ మీడియా, అంతర్రాష్ర్ట సలహాదారు దేవులపల్లి అమర్‌ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ-పేపర్‌ను ప్రముఖ వ్యాపారవేత్త ఏమిరెడ్డి జైహింద్‌రెడ్డి, స్టూడియోను ప్రముఖ న్యాయవాది భూమి సునీల్‌ ప్రారంభించారు. కార్యక్రమంలో ప్రెస్‌ అకాడమీ చైర్మన్‌ అల్లం నారాయణ, సీనియర్‌ పాత్రికేయులు, తెలంగాణ సమాచార కమిషన్‌ మాజీ కమిషనర్‌ కట్టా శేఖర్‌రెడ్డి, ప్రముఖ వ్యాపారవేత్త లింగిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, రెవెన్యూ అధికారుల […]

  • Publish Date - June 3, 2023 / 12:30 AM IST

Vidhaatha |

విధాత: విధాత డిజిటల్‌ మీడియా నుంచి ఈ-పేపర్‌, నవీకరించిన వెబ్‌సైట్‌, స్టూడియోలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. సీనియర్‌ పాత్రికేయులు, ఏపీ మీడియా, అంతర్రాష్ర్ట సలహాదారు దేవులపల్లి అమర్‌ కార్యాలయాన్ని ప్రారంభించారు.

ఈ-పేపర్‌ను ప్రముఖ వ్యాపారవేత్త ఏమిరెడ్డి జైహింద్‌రెడ్డి, స్టూడియోను ప్రముఖ న్యాయవాది భూమి సునీల్‌ ప్రారంభించారు. కార్యక్రమంలో ప్రెస్‌ అకాడమీ చైర్మన్‌ అల్లం నారాయణ, సీనియర్‌ పాత్రికేయులు, తెలంగాణ సమాచార కమిషన్‌ మాజీ కమిషనర్‌ కట్టా శేఖర్‌రెడ్డి, ప్రముఖ వ్యాపారవేత్త లింగిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, రెవెన్యూ అధికారుల సంఘం నాయకుడు లచ్చిరెడ్డి, ప్రముఖ న్యాయవాది మాధవ కృష్ణారెడ్డి, సీనియర్‌ పాత్రికేయులు పొనుగోటి కృష్ణారెడ్డి, టీయూడబ్ల్యూజే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విరాహత్‌ అలీ, విధాత సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.