న్యూఢిల్లీ: లిక్కర్ పాలసీ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్పై సీబీఐ సోమవారం చార్జ్షీట్ దాఖలు చేసింది. ఇదే లిక్కర్ పాలసీ కేసుకు సంబంధించి మనీలాండరింగ్ కేసులో కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్పై ఢిల్లీ హైకోర్టు వాదనలు విననున్న నేపథ్యంలో సీబీఐ చార్జ్షీట్ దాఖలు చేయడం గమనార్హం. ఈ మేరకు రౌస్ అవెన్యూ కోర్టులోని స్పెషల్ సీబీఐ కోర్టులో దర్యాప్తు అధికారులు చార్జ్షీట్ దాఖలు చేశారు.
ఈడీ కేసులో తీహార్ జైలులో రిమాండ్లో ఉన్న కేజ్రీవాల్ను సీబీఐ అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం రూపొందించిన లిక్కర్ పాలసీలో అవినీతి అంశంలో సీబీఐ దర్యాప్తు చేస్తుండగా.. ఈ అంశంలో మనీలాండరింగ్పై ఈడీ దర్యాప్తు చేస్తున్నది.
ఢిల్లీ ప్రభుత్వం రూపొందించిన.. అనంతరం రద్దు చేసిన లిక్కర్ పాలసీ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ను ఈ ఏడాది మార్చి 21న ఈడీ అధికారులు అరెస్టు చేశారు. ఇదే కేసులో సీబీఐ అధికారులు తీహార్ జైల్లో కేజ్రీవాల్ను జూన్ 26న అరెస్టు చేశారు. ఈ కేసులో కేజ్రీవాల్తోపాటు ఆప్ నేత మనీశ్ సిసోడియా, బీఆరెస్ నాయకురాలు కల్వకుంట్ల కవిత కూడా నిందితులుగా ఉన్నారు. ఈడీ కేసులో ఇటీవలే సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఈడీ, సీబీఐ కేసులలో మనీశ్ సిసోడియా బెయిల్ పిటిషన్లను సుప్రీంకోర్టు విచారించనున్నది.
Liquor Policy Case | లిక్కర్ పాలసీ కేసులో కేజ్రీవాల్పై సీబీఐ చార్జ్షీట్
లిక్కర్ పాలసీ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్పై సీబీఐ సోమవారం చార్జ్షీట్ దాఖలు చేసింది. ఇదే లిక్కర్ పాలసీ కేసుకు సంబంధించి మనీలాండరింగ్ కేసులో కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్పై ఢిల్లీ హైకోర్టు వాదనలు విననున్న నేపథ్యంలో సీబీఐ చార్జ్షీట్ దాఖలు చేయడం గమనార్హం.

Latest News
పాములతో ఫ్యామిలీ బిజినెస్.. కోట్లు సంపాదిస్తున్న చైనా యువతి!
రైతు భరోసాపై బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం.. కేసీఆర్ వ్యాఖ్యలపై మంత్రి సీతక్క ఆగ్రహం
హాష్ అయిల్ అంతర్ రాష్ట్ర స్మగ్లింగ్ ముఠా అరెస్టు.. రెండున్నర కోట్ల విలువైన ఆయిల్ స్వాధీనం
కేసీఆర్ తెలంగాణ ‘సెంటిమంట’ పండేనా! ఆ మూడు అంశాలపై మౌనమెందుకు?
సాఫ్ట్వేర్ జాబ్ పోవడంతో.. ఇంటిపై గంజాయి సాగు చేస్తున్న హైదరాబాద్ టెక్కీ
కుసుమంచిలో సర్వే మ్యాప్తో తొలి రిజిస్ట్రేషన్.. భూ రిజిస్ట్రేషన్లలో నూతన శకం
సభ్యులకు ఉద్దేశాలు ఆపాదిస్తారా? ప్రధాని మోదీపై కాంగ్రెస్ సభా హక్కుల నోటీసు
కేసీఆర్ సభకు కేటీఆర్, హరీశ్.. సీఎం సభకు సురేఖ డుమ్మా వెనుక..
బెంగాల్ తొలి విడత..తమిళనాడులో ముగిసిన ఎన్నికల ప్రచారం
కేసీఆర్ ఆదేశాలతోనే.. ఢిల్లీ వెళ్ళా : హరీశ్ రావు