విధాత :తూర్పు తీర ప్రాంతాలను అతలాకుతలం చేసిన యాస్ తుపాను ఎట్టకేలకు తీరం దాటింది. ఒడిశాలోని బాలసోర్ సమీపంలో తీరం దాటినట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. తీరం దాటే సమయంలో గంటకు 155కి.మీ వేగంతో గాలులు వీచినట్లు పేర్కొంది. ఇప్పటికే తుపాను ప్రభావానికి ఒడిశా, పశ్చిమబెంగాల్లో సముద్రపు అలలు ఎగిసిపడ్డాయి. ఉత్తరాంధ్ర తీరప్రాంతాల్లోనూ తుపాను ప్రభావం కనిపించింది.