విధాత, హైదరాబాద్ : తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల ఫలితాలలో కాంగ్రెస్ పార్టీకి, బీజేపీకి మధ్య హోరాహోరి పోటీ సాగుతుంది. కాంగ్రెస్ పార్టీ 8 స్థానాల్లో, బీజేపీ 8స్థానాల్లో , ఎంఐఎం 1 స్థానంలో ఆధిక్యతలో ఉన్నాయి. కాంగ్రెస్ ఆధిక్యతలో ఉన్న సీట్లలో ఖమ్మంలో రామసహాయం రఘురాంరెడ్డి, నల్లగొండలో కుందూరు రఘువీర్రెడ్డి, మహబూబాబాద్లో బలరాం నాయక్, పెద్దపల్లిలో వంశీ కృష్ణ, నాగర్ కర్నూల్లో మల్లు రవి, వరంగల్లో కడియం కావ్య, భువనగిరిలో చామల కిరణ్ కుమార్ రెడ్డి, జహీరాబాద్లో సురేష్ షేట్కార్లు గెలుపు బాటలో సాగుతున్నారు. బీజేపీకి సంబంధించి కరీంగనగర్లో బండి సంజయ్, మల్కాజిగిరిలో ఈటల రాజేందర్, సికింద్రాబాద్లో కిషన్రెడ్డి, నిజమాబాద్ ధర్మపురి అరవింద్, చేవెళ్లలో కొండా విశ్వేశ్వర్రెడ్డి, ఆదిలాబాద్లో నగేశ్, మహబూబ్నగర్లో డీకే అరుణ, మెదక్లో రఘునందన్రావులు ఆధిక్యతలో కొనసాగుతున్నారు. హైదారాబాద్లో ఎంఐఎం అభ్యర్థి అసదుద్దీన్ ఓవైసీ ఆధిక్యతలో ఉన్నారు. బీఆరెస్ పార్టీ ప్రస్తుతం ఒక్క సీటులో కూడా ఆధిక్యతలో లేదు.
తెలంగాణ కాంగ్రెస్ – బీజేపీల మధ్య హోరాహోరి
చెరో ఎనిమిది స్థానాల్లో ఆధిక్యతహైదరాబాద్లో ఎంఐఎం ఆధిక్యత

Latest News
12 ఏళ్ల బీజేపీ ఏలుబడిలో 152 పేపర్ లీకేజీలు
‘పాండోరా బాక్స్’ అసలు రహస్యం ఇదేనా? ట్విస్టులతో కూడిన ఆసక్తికర కథ
శాన్ఫ్రాన్సిస్కోలో ఘనంగా M4M మూవీ 60 రోజుల విజయోత్సవం! ‘M4M-2’ సీక్వెల్
‘మిస్టర్ మిడిల్ క్లాస్’ అందరికీ కనెక్ట్ అవుతున్న పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్!
గోదావరి పుష్కరాలలోపే భద్రాద్రికి నూతన వైభవం: మంత్రి పొంగులేటి
వచ్చే మూడు నెలలకు ఒకేసారి రేషన్ : కేంద్రం కీలక నిర్ణయం
హాస్టల్ మెస్లోకి మొసలి.. అంతా పరుగో పరుగు!
సర్ పూర్తయ్యే వరకు గాంధీభవన్ రావద్దు : సీఎం రేవంత్ రెడ్డి
మా భూములకు కాదు… మా బతుకులకే కంచె వేస్తున్నారు !
జపాన్ ఓపెన్ టైటిల్ విజేత పీ.వీ.సింధు