విధాత, హైదరాబాద్ : మెదక్ జిల్లా మనోహరాబాద్ మండల కేంద్రంలో 44వ జాతీయ రహదారిపై బుధవారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ప్రమాదంలో ఏడు నెలల గర్భిణితో పాటు ఆమె కడుపులో ఉన్న శిశువు మృతి చెందింది. పోలీసుల కథనం ప్రకారం మిర్దొడ్డి మండలానికి చెందిన దంపతులు మనోహరాబాద్ నుంచి దండుపల్లికి ద్విచక్రవాహనంపై బయల్దేరారు. జాతీయ రహదారిని క్రాస్ చేస్తుండగా తూప్రాన్ వైపు నుంచి అతివేగంగా వచ్చిన లారీ ఢీ కొట్టడంతో దంపతులిద్దరూ కిందపడిపోయారు. మహిళతో పాటు ఆమె గర్భంలోని ఏడు నెలల శిశువు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ హృదయ విదారక ఘటన చూసిన స్థానికులు కంటతడి పెట్టారు. పోలీసులు ప్రమాద స్థలికి చేరుకుని విచారణ చేపట్టారు.
తీవ్ర విషాదం మిగిల్చిన రోడ్డు ప్రమాదం
మెదక్ జిల్లా మనోహరాబాద్ మండల కేంద్రంలో 44వ జాతీయ రహదారిపై బుధవారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.

Latest News
బాక్సాఫీసుపై 'శంకర వరప్రసాద్గారి' మెరుపుదాడి
ఈ బొమ్మలు..ఆదివాసీ సంస్కృతి, వారసత్వ ప్రతీకలూ
అమ్మల జాతరలో ఆదివాసీ బిడ్డ జ్ఞాపకం..కొత్త రంగులు అద్దుకున్న అమర స్థూపం
భర్త మహాశయులకు విజ్ఞప్తి మూవీ రివ్యూ: రవితేజ కామెడీ పండిందా?
మేడారానికి ప్రత్యేక ఆకర్షణ ఈ బొమ్మలు
మేడారం జాతరకు మూడు కోట్ల మంది వస్తారని అధికారుల ప్రాథమిక అంచనా
గ్రామ పంచాయతీలకు తీపి కబురు.. రూ.277 కోట్లు విడుదల చేసిన ఆర్ధిక శాఖ
గ్రీన్లాండ్ స్వాధీనం కోసం అమెరికాలో బిల్లు.. ఈ ద్వీపంపై ట్రంప్ ఎందుకు కన్నేశారు..?
బాయ్ఫ్రెండ్ కోసం లవ్ ఇన్సూరెన్స్.. జాక్పాట్ కొట్టిన మహిళ
సంక్రాంతి పందెం కోళ్లు.. టాటా కార్లు...సియోరా..పంచ్ ఫేస్ లిఫ్ట్ ల దూకుడు