విధాత, హైదరాబాద్ : మెదక్ జిల్లా మనోహరాబాద్ మండల కేంద్రంలో 44వ జాతీయ రహదారిపై బుధవారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ప్రమాదంలో ఏడు నెలల గర్భిణితో పాటు ఆమె కడుపులో ఉన్న శిశువు మృతి చెందింది. పోలీసుల కథనం ప్రకారం మిర్దొడ్డి మండలానికి చెందిన దంపతులు మనోహరాబాద్ నుంచి దండుపల్లికి ద్విచక్రవాహనంపై బయల్దేరారు. జాతీయ రహదారిని క్రాస్ చేస్తుండగా తూప్రాన్ వైపు నుంచి అతివేగంగా వచ్చిన లారీ ఢీ కొట్టడంతో దంపతులిద్దరూ కిందపడిపోయారు. మహిళతో పాటు ఆమె గర్భంలోని ఏడు నెలల శిశువు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ హృదయ విదారక ఘటన చూసిన స్థానికులు కంటతడి పెట్టారు. పోలీసులు ప్రమాద స్థలికి చేరుకుని విచారణ చేపట్టారు.
తీవ్ర విషాదం మిగిల్చిన రోడ్డు ప్రమాదం
మెదక్ జిల్లా మనోహరాబాద్ మండల కేంద్రంలో 44వ జాతీయ రహదారిపై బుధవారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.

Latest News
తక్కువ ధర, ప్రీమియం ఫీచర్లు : మోటరోలా ఎడ్జ్ 70 / 70 ప్రో వివరాలివిగో..!
దక్షిణాఫ్రికాతో ఆఖరి మ్యాచ్ : భారత్ భారీ విజయం — సిరీస్ కైవసం
అనన్య నాగళ్ల థండర్ థైస్ షో.. మామూలుగా లేదు భయ్యా!
చలికాలంలో ఇళ్లలో హీటర్స్ వాడటం ఎంత సేఫ్?
అమ్మ పాడే జోల పాటల్లో ఇంత గొప్పదనం ఉందా?
విమాన టికెట్ రేట్లపై సీలింగ్.. కేంద్ర విమానయాన శాఖ కీలక నిర్ణయం
ఐజేయూ నేతలను సత్కరించిన గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్
విశాఖ వన్డేలో డికాక్ సెంచరీ..భారత్ టార్గెట్ 271 పరుగులు
మోదీ–పుతిన్ భేటీలో అందరి దృష్టిని ఆకర్షించిన ఓ అందం
వాళ్లు వస్తే మంచి రోజులు కాదు..ముంచే రోజులొస్తాయి: సీఎం రేవంత్ రెడ్డి