విధాత, హైదరాబాద్ : నగరంలోని అబిడ్స్లో కిడ్నాప్కు గురైన ఒకటో తరగతి బాలిక సురక్షితంగా దొరికింది. శనివారం సాయంత్రం అబిడ్స్ లోని కట్టెలమండిలో ఆడుకుంటున్న చిన్నారిని ఓ వ్యక్తి చాక్లెట్ ఇచ్చి ఆటోలో తీసుకెళ్లాడు. కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఐదు బృందాలతో గాలించారు. రంగారెడ్డి జిల్లా కొత్తూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇనుముల నర్వలో నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. కిడ్నాపర్ను బిహార్కు చెందిన ఎండీ బిలాల్గా గుర్తించారు. అతడిని పోలీసులు విచారిస్తున్నారు. చిన్నారి ఆచుకీ కోసం ఐదు ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగగా.. సీసీ కెమెరాల ఆధారంగా కేసును చేధించారు. చిన్నారితో పాటు నిందితుడిని అబిడ్స్ పీఎస్ కు పోలీసులు తీసుకువచ్చారు. అనంతరం బాలికను సైఫాబాద్ భరోసా సెంటర్కు తరలించారు. ఈ ఘటనపై పోక్సో కేసు నమోదు చేసినట్లు అబిడ్స్ ఏసీపీ చంద్రశేఖర్ తెలిపారు. మరోవైపు నిందితుడిని కూడా పోలీసులు పీఎస్కు తీసుకొచ్చిన సమయంలో చిన్నారి కుటుంబసభ్యులు, బంధువులు అతడిపై దాడి చేశారు. పోలీసులు అతికష్టంమీద నిందితుడిని పీఎస్ లోపలికి తీసుకెళ్లారు.