విధాత, వరంగల్ ప్రతినిధి: హనుమకొండలో ఎడ్యుకేషన్ వెల్ఫేర్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విభాగంలో ఏసీబీ సోదాలు నిర్వహించగా స్కూల్ భవనం బిల్లుల మంజూరు కోసం రూ.8వేలు లంచం తీసుకుంటూ అసిస్టెంట్ ఇంజనీర్ రమేష్ గురువారం పట్టుబడ్డారు. కొడకండ్లలో స్కూల్ భవనం బిల్లుల మంజూరు కోసం రమేష్ రూ. 18వేలు లంచం అడుగగా గతంలోనే రూ.10వేలు లంచం తీసుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం మిగిలిన డబ్బులు 8వేలు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. రమేష్ ప్రస్తుతం జనగామ డీఈవో ఆఫీస్ లో పని చేస్తున్నారు.