హైదరాబాద్: టి.జి.టెట్-2024 పేపర్-1లో 67.13% మంది అర్హత సాధించారు. పేపర్-2లో 34.18% అర్హులయ్యారు. టి.జి.టెట్-2024 ఫలితాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుధవారం విడుదల చేశారు. పేపర్-1 పరీక్షకు 85,996 అభ్యర్థులు హాజరుకాగా.. 57,725 అభ్యర్థులు అర్హత సాధించారు. పేపర్-2 పరీక్షకు 1,50,491 హాజరుకాగా.. 51,443 అభ్యర్థులు అర్హత సాధించారు. https://schooledu.telangana.gov.in వెబ్ సైట్లో ఫలితాలు అందుబాటులో ఉన్నాయి. 2023తో పోలిస్తే పేపర్-1లో 30.24% అర్హత పెరిగింది. 20023తో పోలిస్తే పేపర్-2లో 18.88% పెరిగింది. టెట్ దరఖాస్తుల సమయంలో ఎన్నికల కోడ్ కారణంగా టెట్ దరఖాస్తు ఫీజు తగ్గింపు నిర్ణయాన్ని ఎన్నికల కమిషన్ అంగీకరించలేదు. ఈ నేపథ్యంలో దరఖాస్తు దారులకు ఉపశమనం కలిగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. టెట్-2024లో అర్హత సాధించని దరఖాస్తుదారులకు వచ్చే టెట్ కు ఉచితంగా దరఖాస్తు చేసుకునే వెలుసుబాటు కల్పించింది. టెట్-2024లో అర్హత సాధించిన వారికి ఒకసారి ఉచితంగా డీఎస్సీ దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించింది.
TGTET | టి.జి.టెట్-2024 ఫలితాలు విడుదల చేసిన … సీఎం రేవంత్ రెడ్డి
టి.జి.టెట్-2024 పేపర్-1లో 67.13% మంది అర్హత సాధించారు. పేపర్-2లో 34.18% అర్హులయ్యారు. టి.జి.టెట్-2024 ఫలితాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుధవారం విడుదల చేశారు. పేపర్-1 పరీక్షకు 85,996 అభ్యర్థులు హాజరుకాగా.. 57,725 అభ్యర్థులు అర్హత సాధించారు.

Latest News
ప్రొఫెసర్ లైంగికదాడి.. గర్భం దాల్చిన బీఈడీ విద్యార్థిని
చలికాలంలో వేడి నీళ్లతో స్నానమా..? ఈ నష్టాలు తప్పవు..!
ఇంటర్నేషనల్ స్టేజ్లో మెరుపు మెరిపించిన నటి ప్రగతి
గోవాలో ఘోర అగ్నిప్రమాదం.. 23 మంది సజీవదహనం
ఐదేళ్ల బాలుడిని చంపిన చిరుత
ఈ వారం రాశిఫలాలు.. ప్రభుత్వ ఉద్యోగం కోసం యత్నిస్తున్న ఈ రాశి నిరుద్యోగులకు శుభవార్త..!
ఆదివారం రాశిఫలాలు.. ఈ రాశివారు ప్రయాణాలు వాయిదా వేస్తే మంచిది..!
తక్కువ ధర, ప్రీమియం ఫీచర్లు : మోటరోలా ఎడ్జ్ 70 / 70 ప్రో వివరాలివిగో..!
దక్షిణాఫ్రికాతో ఆఖరి మ్యాచ్ : భారత్ భారీ విజయం — సిరీస్ కైవసం
అనన్య నాగళ్ల థండర్ థైస్ షో.. మామూలుగా లేదు భయ్యా!