TGTET | టి.జి.టెట్-2024 ఫలితాలు విడుదల చేసిన … సీఎం రేవంత్ రెడ్డి

టి.జి.టెట్-2024 పేపర్-1లో 67.13% మంది అర్హత సాధించారు. పేపర్-2లో 34.18% అర్హులయ్యారు. టి.జి.టెట్-2024 ఫలితాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుధవారం విడుదల చేశారు. పేపర్-1 పరీక్షకు 85,996 అభ్యర్థులు హాజరుకాగా.. 57,725 అభ్యర్థులు అర్హత సాధించారు.

  • Publish Date - June 12, 2024 / 04:29 PM IST

హైదరాబాద్‌: టి.జి.టెట్-2024 పేపర్-1లో 67.13% మంది అర్హత సాధించారు. పేపర్-2లో 34.18% అర్హులయ్యారు. టి.జి.టెట్-2024 ఫలితాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుధవారం విడుదల చేశారు. పేపర్-1 పరీక్షకు 85,996 అభ్యర్థులు హాజరుకాగా.. 57,725 అభ్యర్థులు అర్హత సాధించారు. పేపర్-2 పరీక్షకు 1,50,491 హాజరుకాగా.. 51,443 అభ్యర్థులు అర్హత సాధించారు. https://schooledu.telangana.gov.in వెబ్ సైట్లో ఫలితాలు అందుబాటులో ఉన్నాయి. 2023తో పోలిస్తే పేపర్-1లో 30.24% అర్హత పెరిగింది. 20023తో పోలిస్తే పేపర్-2లో 18.88% పెరిగింది. టెట్ దరఖాస్తుల సమయంలో ఎన్నికల కోడ్ కారణంగా టెట్ దరఖాస్తు ఫీజు తగ్గింపు నిర్ణయాన్ని ఎన్నికల కమిషన్ అంగీకరించలేదు. ఈ నేపథ్యంలో దరఖాస్తు దారులకు ఉపశమనం కలిగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. టెట్-2024లో అర్హత సాధించని దరఖాస్తుదారులకు వచ్చే టెట్ కు ఉచితంగా దరఖాస్తు చేసుకునే వెలుసుబాటు కల్పించింది. టెట్-2024లో అర్హత సాధించిన వారికి ఒకసారి ఉచితంగా డీఎస్సీ దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించింది.

Latest News