విధాత: ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వంలో విలీనం చేయాలని సీపీఐ సభ్యలు కూనంనేని సాంబశివరావు గురువారం శాసన సభలో సీపీ ఐ తరపున తీర్మానం ప్రవేశ పెట్టారు. తెలంగాణ రాష్ట్ర వ్యాపితంగా ఉన్న ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయాలని కోరారు. ఆర్టీసీ ట్రేడ్ యూనియన్ల యాక్టివిటీని పునరుద్ధరించాలన్నారు. చనిపోయిన ఉద్యోగి కుటుంబంలో కన్సాలిడేటెడ్ విధానం కాకుండా, రెగ్యులర్ బేసిస్ లో నియామకం చేపట్టాలని ప్రభుత్వాన్ని ఆ తీర్మానంలో కోరారు. 2013లో జరిగిన వేతన సవరణకు సంబంధించి బాండ్ల డబ్బులను విడుదల చేయాలన్నారు. మహిళా కండక్టర్లకు రాత్రి డ్యూటీ వ్యవధిని తగ్గించాలని కోరుతూ ఈ అంశాలపై అసెంబ్లీలో చర్చించడానికి కూనంనేని వాయిదా తీర్మానం ప్రవేశ పెట్టారు. కాగా కూనంనేని ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని స్పీకర్ తిరస్కరించారు.
CPI | ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వంలో విలీనం చేయండి..అసెంబ్లీలో తీర్మానం ప్రవేశ పెట్టిన సీపీఐ
ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వంలో విలీనం చేయాలని సీపీఐ సభ్యలు కూనం నేని సాంభశివరావు గురువారం శాసన సభలో సీపీ ఐ తరపున తీర్మానం ప్రవేశ పెట్టారు.

Latest News
12 ఏళ్ల బీజేపీ ఏలుబడిలో 152 పేపర్ లీకేజీలు
‘పాండోరా బాక్స్’ అసలు రహస్యం ఇదేనా? ట్విస్టులతో కూడిన ఆసక్తికర కథ
శాన్ఫ్రాన్సిస్కోలో ఘనంగా M4M మూవీ 60 రోజుల విజయోత్సవం! ‘M4M-2’ సీక్వెల్
‘మిస్టర్ మిడిల్ క్లాస్’ అందరికీ కనెక్ట్ అవుతున్న పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్!
గోదావరి పుష్కరాలలోపే భద్రాద్రికి నూతన వైభవం: మంత్రి పొంగులేటి
వచ్చే మూడు నెలలకు ఒకేసారి రేషన్ : కేంద్రం కీలక నిర్ణయం
హాస్టల్ మెస్లోకి మొసలి.. అంతా పరుగో పరుగు!
సర్ పూర్తయ్యే వరకు గాంధీభవన్ రావద్దు : సీఎం రేవంత్ రెడ్డి
మా భూములకు కాదు… మా బతుకులకే కంచె వేస్తున్నారు !
జపాన్ ఓపెన్ టైటిల్ విజేత పీ.వీ.సింధు