Sundar Pichai : వామ్మో అనిపించేలా.. సుందర్ పిచాయ్ వేతనం!

గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ కొత్త వేతనం 692 మిలియన్ డాలర్లు, రూ.6,361కోట్లకు చేరిక. ఏఐ, టెక్ రంగంలో గరిష్ఠ వేతనం భారతీయుడు సుందర్ పిచాయ్.

Sundar Pichai

విధాత: గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ వేతనం మరోసారి పెరిగింది. గూగుల్‌ మాతృ కంపెనీ ఆల్ఫాబెట్‌ పిచాయ్‌ వేతనాన్ని పెంచుతూ నిర్ణయం తీసుకుంది. రానున్న మూడేళ్ల కాలానికి పిచాయ్ 692 మిలియన్ డాలర్ల అంటే రూ.6,361కోట్లకు పైబడి వేతనం అందుకోనున్నారు. గరిష్టంగా రూ. 63,61,79,82,000గా ఉండనుంది. ఏఐతో టెక్‌ ప్రపంచం వేగంగా మారుతున్న క్రమంలో పిచాయ్‌పై బలమైన నమ్మకంతో కంపెనీ ఈ వేతన పెంపును ప్రకటించింది. ఆగస్టు 2015లో పిచాయ్ CEOగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుండి, గూగుల్ మార్కెట్ క్యాపిటలైజేషన్ దాదాపు ఏడు రెట్లు పెరిగి $535 బిలియన్ల నుండి $3.6 ట్రిలియన్లకు చేరుకుంది. ఇది జనవరిలో $4 ట్రిలియన్లకు చేరుకుంది.

పెరిగిన వేతనంతో ప్రపంచవ్యాప్తంగా అత్యధిక వేతనం పొందుతున్న సీఈఓల్లో భారత సంతతికి చెందిన సుందర్ పిచాయ్ ఒకరుగా గుర్తింపు పొందారు అని ఫైనాన్షియల్ టైమ్స్ శనివారం నివేదించింది. మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెల్ల 2025 ఆర్థిక సంవత్సరంలో $96.5 మిలియన్లు సంపాదించగా, ఆపిల్ యొక్క టిమ్ కుక్ $74.3 మిలియన్లను పొందారు.

సుందర్ పిచాయ్ కొత్త వేతనంలో అధిక భాగం నగదు బదులుగా..పనితీరుపై ఆధారపడిన కంపెనీ షేర్ల నుండి అందనుంది. అతని జీతం విలువ భవిష్యత్తులో కంపెనీ ఎంత బాగా పనిచేస్తుందనే దానిపై ఆధారపడి ఉండటం గమనార్హం. కంపెనీ బాగా పనిచేస్తే, దాని షేర్ ధర పెరిగితే…ఆ మేరకు సీఈవో కూడా ప్రయోజనం పొందుతారు.

ఇవి కూడా చదవండి :

కోడిగుడ్లకు యుద్దం ఎఫెక్ట్..సగానికి తగ్గిన ధరలు!
Gen Z | ఎన్ని తరాలు మారినా మొగుడు చెప్పిందే పెళ్లాం వినాల్సిందేనా.. జెన్‌ జెడ్‌లోనూ అవే పాతకాలపు ఆలోచనలు

Latest News