తెలంగాణ డీజీపీ అంజనీ కుమార్పై ఎలక్షన్ కమిషన్ సస్పెన్షన్ వేటు వేసింది. ఎన్నికల కోడ్ ఉన్న నేపథ్యంలో టీపీసీసీ చీఫ్రేవంత్రెడ్డిని కలవడంతో డీజీపీపై ఈసీ ఆగ్రహం వ్యక్తం చేసింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలవడంతో రేవంత్రెడ్డిని కలిసిన డీజీపీ పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపారు. దీంతో అంజనీకుమార్పై చర్యలు తీసుకున్న కేంద్ర ఎన్నికల సంఘం ఆయనను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.