విధాత, హైదరాబాద్ : మరోసారి హీరా గ్రూప్ అక్రమాలపై ఈడీ సోదాలు నిర్వహించింది. శనివారం తెల్లవారుజాము నుంచే హైదరాబాద్, తిరుపతి, విశాఖపట్నంలో ఏకకాలంలో ఈడీ బృందాలు సోదాలు నిర్వహించింది. బంజారాహిల్స్ లోని నౌహీరా షేక్ ఆఫీస్, ఇళ్లతో పాటు సంస్థ డైరెక్టర్లు, సీఈవోల ఇళ్లలోనూ ఈడీ సోదాలు కొనసాగించింది. గతంలో నమోదైన కేసు ఆధారంగా ఈడీ ఈ తనిఖీలు నిర్వహించింది.. స్కీమ్ల పేరుతో రూ.వేల కోట్ల డిపాజిట్లు సేకరించి మోసానికి పాల్పడ్డారనే ఆరోపణలపై హీరా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ డైరెక్టర్ నౌహీరా షేక్పై ఇప్పటికే దేశవ్యాప్తంగా 60కి పైగా కేసులు ఉన్నాయి. ఈ వ్యవహారంలో ఇప్పటి వరకు ఈడీ రూ.380కోట్ల పైచిలుకు ఆస్తులను అటాచ్ చేసింది. టోలిచౌకీలోని ఎంఎస్సీ కాలనీలో ఉన్న మొత్తం రూ.80 కోట్ల విలువైన 81 ప్లాట్లను, హీరా గ్రూప్కు సంబంధించిన పలు స్థిరాస్తులను ఈడీ ఇప్పటికే అటాచ్ చేసింది.