విధాత:నా రాజీనామా పత్రాన్ని అసెంబ్లీ లో అందించాలని భావించాను.కానీ ఆ అవకాశం చిక్కలే నేరుగా స్పీకర్ కి ఇద్దాం అనుకున్న కానీ స్పీకర్ కరోనా అడ్డం పెట్టుకొని కలవలేదు.అనివార్య మైన పరిస్థితుల్లో సెక్రెటరీ కి ఇచ్చాను.అసెంబ్లీ లో అంతా నియంతృత్వం గతంలో ఉన్న పార్లమెంటరీ సంప్రదాయాలు అన్నీ తుంగలో తొక్కారు.మాజీ ఎమ్మెల్యే, ఉద్యమ కారుడు ఏనుగు రవీందర్ రెడ్డి నీ కూడా అనుమతించలేదు.
కెసిఆర్ ఈ రాజ్యాంగం ఎంది, ఎమ్మెల్యే ఎంపీ లు ఎంటి అనే భావనలో ఉన్నారు దాని ప్రతి బింబమే ఈరోజు మాకు ఎదురైన అనుభవం.ఈ వెకిలి చేస్టాలు , నకిలీ ప్రయత్నాలు ఆపకపోతే నీకే ఎదురు తిరుగుతాయి.
చిల్లర ప్రయత్నాలు సాగవు
హుజూరాబాద్ లో ఇన్నాళ్లు పెన్షన్ లేదు కానీ ఇప్పుడు ఆగ మేఘాల ఎన్నికల కోసం మీద పెన్షలు ఇస్తున్నారు.
నాకు మద్దతు తెలపక పోతే ఆపెస్త అంటున్నారు అట నే ఇంట్లో నుండి ఇవ్వడం లేదు గుర్తు పెట్టుకో..హుజూరాబాద్ చైతన్యం గడ్డ ఇలాంటి వాటిని తొక్కి పడేసి ధర్మాన్ని గెలిపిస్తరు . ధర్మ అధర్మం, డబ్బు సంచులకి అగౌరవనికి మధ్య జరిగే పోరాటం.నా DNA అంతా లెఫ్ట్.. కానీ ఈ రోజు నియంత పాలన అంతం అనే ఒకే ఒక లక్షం గా రైట్ పార్టీలో చేరుతున్న.
తుల ఉమ, అందే బాబాన్న, vk మహేశ్, కేశవ రెడ్డి, గండ్ర నళిని, సత్యనారాయణ తో పాటు అనేక మందిమి చేరుతున్నాము.
ఆ తరువాత అన్ని జిల్లాల నుండి వేలాదిగా చేరుతున్నారు.
లెఫ్ట్ సంఘాలు కూడా సంఘీభావం
RSU నుండి RSS వరకు అందరూ నియంత పాలన అంతమొందించడానికి కలిసి వస్తున్నారు. 20 ఏళ్ల తరువాత 2021 లో తెలంగాణ ఆత్మ గౌరవ ఉద్యమం మొదలు పెడుతున్నాము. కేటీఆర్ 2018 లోనే కౌశిక్ రెడ్డి కి డబ్బులు పంపించి నా ఓడ గొట్టడానికి ప్రయత్నం చేశారు.నా ఇంటిమీద రైడ్ చేయించారు.
ఇవన్నీ హుజూరాబాద్ ప్రజలు గమనిస్తున్నారు.ఇంటి వాళ్ళు బయటి వాళ్ళు అయ్యారు. బయటి వాళ్ళు ఇంటి వాళ్ళు అయ్యారు.నన్ను కాల గర్భంలో కలపాలి అనుకుంటున్నారు కానీ అది రివర్స్ అవుతుంది. నియంత పాలన అంతం అవుతుంది.