డిప్యూటీ సీఎం భట్టి : గత పాలకులు ఎంసీఆర్డీపై దృష్టి పెట్టలేదు

దేశంలోనే అత్యుత్తమ శిక్షణ సంస్థగా ఎంపీఆర్డీని నిలపాలని, అందుకోసం ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం ఉంటుందని కమిటీ చైర్మన్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెల్లడించారు. శనివారం జరిగిన మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల విభాగం గవర్నింగ్ బాడీ సబ్ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. స్వయం సమృద్ధి సాధించి, ఆర్థికంగా బ్రోగతి సాధించాలని సూచించారు.

దేశంలోనే అత్యుత్తమ శిక్షణ సంస్థగా ఎంసీఆర్డీ

విధాత, హైదరాబాద్: దేశంలోనే మొట్టమొదట ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను పరిపాలనలో పూర్తిస్థాయిలో ఉపయోగించిన రాష్ట్రంగా తెలంగాణ ఎదగాలన్నారు. అందుకు తగిన విధంగా శిక్షణ ఇవ్వాలని అధికారులకు సూచించారు. ప్రిన్సిపల్ సెక్రెటరీ నుంచి గ్రామస్థాయి అధికారి వరకు శిక్షణ ఇవ్వాలని వెల్లడించారు.

స్వయం సహాయక సంఘాల లీడర్లకు జిల్లాస్థాయిలో, మండల స్థాయిలో రెండు రోజులపాటు శిక్షణ ఇచ్చి వారు ఆర్థికంగా ఉన్నత స్థానానికి ఎదిగేందుకు కృషి చేయాలన్నారు.

గత పది సంవత్సరాలు ఎంసీఆర్డీపై దృష్టి సారించలేదు ఇకనుంచి ప్రతి ఆరు నెలలకు ఒకసారి సబ్ కమిటీ సమావేశం అవుతుందని పేర్కొన్నారు. ఈ సమావేశంలో మంత్రులు దుద్దిళ్ళ శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఎంసీఆర్డీ డైరెక్టర్ జనరల్ శాంతి కుమారి పాల్గొన్నారు.