విధాత: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన రేవంత్ రెడ్డిని గురువారం రెవెన్యూ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ వీ లచ్చిరెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. నూతన సీఎంకు పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం ఏర్పాటు చేయడం పట్ల లచ్చిరెడ్డి హర్షం వ్యక్తం చేశారు.