విధాత : బీఎస్పీ పార్టీ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే 43మంది అభ్యర్థులతో రెండో జాబితాను వెల్లడించింది. తొలి జాబితాలో 20మంది అభ్యర్థులను ప్రకటించిన బీఎస్పీ చీఫ్ ప్రవీణ్ కుమార్ రెండో జాబితాలో ముగ్గురు ఓసీలకు, ఇద్దరు మైనార్టీలకు టికెట్లు కేటాయించింది. వరంగల్ తూర్పు టికెట్ను ట్రాన్స్జెండర్కు కేటాయించి వినూత్న నిర్ణయం తీసుకున్నారు. మునుగోడు సీటును ఆంధోజు శంకరచారికి కేటాయించారు. వరంగల్ ఈస్ట్ల పుష్పలతకు, ములుగు జంపన్న నాయక్, పినపాక వజ్జ శ్యామ్కు కేటాయించారు. మధిర చెరుకుపల్లి శారదక, భద్రాచలంకు ఇర్పా రవికి టికెట్ ఇచ్చారు.