హైదరాబాద్, సెప్టెంబర్ 18 (విధాత): రాష్ట్రంలో పనిచేస్తున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు మూడు నుంచి ఆరు నెలల జీతాలు చెల్లించకుండా పెండింగ్ లో పెట్టడాన్ని నిరసిస్తూ సెప్టెంబర్ 19వ తేదీన బేగంపేటలోని ప్రజా దర్బార్ కు వెళ్లాలని నిర్ణయించినట్లు తెలంగాణ జేఏసీ కమిటీ ఔట్ సోర్సింగ్ ఎంప్లాయిస్ తెలిపింది. ఏజెన్సీ వ్యవస్థను రద్ధు చేసి ఉద్యోగ భద్రత ఇస్తూ, ప్రత్యేక కార్పొరేషన్ ద్వారా సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్ చేసింది. వివిధ సొసైటీలు, ప్రభుత్వ శాఖలలో సుమారు రెండు లక్షల మంది వరకు పనిచేస్తుండగా, తమ సంక్షేమాన్ని ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమని జేఏసీ పేర్కొన్నది. చనిపోయిన ఉద్యోగులకు రూ.10 లక్షలు ఎక్ర్ గ్రేషియా చెల్లించాలి, పెండింగ్ జీతాలు వెంటనే విడుదల చేయాలి, తొలగించిన వారిని తిరిగి విధుల్లోకి తీసుకోవాలనే డిమాండ్లతో చలో ప్రజా దర్భార్ కు పిలుపునిచ్చినట్లు తెలంగాణ జేఏసీ కమిటీ ఔట్ సోర్సింగ్ ఎంప్లాయిస్ ప్రెసిడెంట్ పులి లక్ష్మయ్య, ప్రధాన కార్యదర్శులు డీ.శ్రీధర్, డీ.శ్రీనివాస్ తెలిపారు.
ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు శుక్రవారం చలో ప్రజా దర్బార్
రాష్ట్రంలో పనిచేస్తున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు మూడు నుంచి ఆరు నెలల జీతాలు చెల్లించకుండా పెండింగ్ లో పెట్టడాన్ని నిరసిస్తూ సెప్టెంబర్ 19వ తేదీన బేగంపేటలోని ప్రజా దర్బార్ కు వెళ్లాలని నిర్ణయించినట్లు తెలంగాణ జేఏసీ కమిటీ ఔట్ సోర్సింగ్ ఎంప్లాయిస్ తెలిపింది

Latest News
Pillow Talk | పడుకునే ముందు 10 నిమిషాలు.. దంపతుల మధ్య అన్యోన్యతను పెంచే సూపర్ సీక్రెట్!
Toyota Innova Crysta | సరికొత్త లుక్.. అదిరిపోయే ఫీచర్లతో టయోటా ఇన్నోవా క్రిస్టా 2026 మోడల్ లాంచ్.. ధర ఎంతంటే..!
Tecno Pova 8 | 8000mAh భారీ బ్యాటరీతో టెక్నో నుంచి కొత్త స్మార్ట్ఫోన్.. లాంచ్ ఎప్పుడంటే..!
Credit Card Limit | మీ క్రెడిట్ కార్డు లిమిట్ను బ్యాంకులు అకస్మాత్తుగా తగ్గించేశాయా?
రూ.30వేల కోట్ల విలువైన భూమిని కాపాడాం: హైడ్రా
Parthiban | ఆ మధ్య త్రిషపై ఘాటు వ్యాఖ్యలు చేసిన ప్రముఖ నటుడు..ఇప్పుడు విజయ్ను కలిసి ప్రత్యేక పెయింటింగ్ బహుకరణ
హైటెక్స్ లో ‘థ్రెడ్ పోచంపల్లి’ప్రదర్శనను ప్రారంభించిన మంత్రులు
హైదరాబాద్లో ఎబోలా కలవరం
సైకిల్తో సవారి.. భవిష్యత్తుకు పచ్చని దారి : చంద్రబాబు
అగ్ని ప్రమాదాల నివారణపై సీఎం సమీక్షించాలి : కవిత