హైదరాబాద్, సెప్టెంబర్ 18 (విధాత): రాష్ట్రంలో పనిచేస్తున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు మూడు నుంచి ఆరు నెలల జీతాలు చెల్లించకుండా పెండింగ్ లో పెట్టడాన్ని నిరసిస్తూ సెప్టెంబర్ 19వ తేదీన బేగంపేటలోని ప్రజా దర్బార్ కు వెళ్లాలని నిర్ణయించినట్లు తెలంగాణ జేఏసీ కమిటీ ఔట్ సోర్సింగ్ ఎంప్లాయిస్ తెలిపింది. ఏజెన్సీ వ్యవస్థను రద్ధు చేసి ఉద్యోగ భద్రత ఇస్తూ, ప్రత్యేక కార్పొరేషన్ ద్వారా సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్ చేసింది. వివిధ సొసైటీలు, ప్రభుత్వ శాఖలలో సుమారు రెండు లక్షల మంది వరకు పనిచేస్తుండగా, తమ సంక్షేమాన్ని ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమని జేఏసీ పేర్కొన్నది. చనిపోయిన ఉద్యోగులకు రూ.10 లక్షలు ఎక్ర్ గ్రేషియా చెల్లించాలి, పెండింగ్ జీతాలు వెంటనే విడుదల చేయాలి, తొలగించిన వారిని తిరిగి విధుల్లోకి తీసుకోవాలనే డిమాండ్లతో చలో ప్రజా దర్భార్ కు పిలుపునిచ్చినట్లు తెలంగాణ జేఏసీ కమిటీ ఔట్ సోర్సింగ్ ఎంప్లాయిస్ ప్రెసిడెంట్ పులి లక్ష్మయ్య, ప్రధాన కార్యదర్శులు డీ.శ్రీధర్, డీ.శ్రీనివాస్ తెలిపారు.
ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు శుక్రవారం చలో ప్రజా దర్బార్
రాష్ట్రంలో పనిచేస్తున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు మూడు నుంచి ఆరు నెలల జీతాలు చెల్లించకుండా పెండింగ్ లో పెట్టడాన్ని నిరసిస్తూ సెప్టెంబర్ 19వ తేదీన బేగంపేటలోని ప్రజా దర్బార్ కు వెళ్లాలని నిర్ణయించినట్లు తెలంగాణ జేఏసీ కమిటీ ఔట్ సోర్సింగ్ ఎంప్లాయిస్ తెలిపింది

Latest News
12 ఏళ్ల బీజేపీ ఏలుబడిలో 152 పేపర్ లీకేజీలు
‘పాండోరా బాక్స్’ అసలు రహస్యం ఇదేనా? ట్విస్టులతో కూడిన ఆసక్తికర కథ
శాన్ఫ్రాన్సిస్కోలో ఘనంగా M4M మూవీ 60 రోజుల విజయోత్సవం! ‘M4M-2’ సీక్వెల్
‘మిస్టర్ మిడిల్ క్లాస్’ అందరికీ కనెక్ట్ అవుతున్న పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్!
గోదావరి పుష్కరాలలోపే భద్రాద్రికి నూతన వైభవం: మంత్రి పొంగులేటి
వచ్చే మూడు నెలలకు ఒకేసారి రేషన్ : కేంద్రం కీలక నిర్ణయం
హాస్టల్ మెస్లోకి మొసలి.. అంతా పరుగో పరుగు!
సర్ పూర్తయ్యే వరకు గాంధీభవన్ రావద్దు : సీఎం రేవంత్ రెడ్డి
మా భూములకు కాదు… మా బతుకులకే కంచె వేస్తున్నారు !
జపాన్ ఓపెన్ టైటిల్ విజేత పీ.వీ.సింధు