విధాత, హైదరాబాద్ : సమాజ నిర్మాణంలో ఆర్చ్ బిషప్ తుమ్మబాల ఎనలేని సేవలు అందించారని, ఆయన సేవలు చిరస్మరణీయమని సీఎం రేవంత్రెడ్డి కొనియాడారు. సికింద్రాబాద్ సెయింట్ మేరీ స్కూల్లో విశ్రాంత ఆర్చ్ బిషప్ తుమ్మబాల పార్ధీవ దేహానికి నివాళులు సీఎం రేవంత్రెడ్డి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శాంతి, మతసామరస్యం, విద్యను తుమ్మబాల ప్రజలకు అందించారన్నారు. వ్యక్తిగతంగా తుమ్మబాలతో నాకు ప్రత్యేక అనుబంధం ఉందన్నారు. 2019 ఎంపీ ఎన్నికల్లో, 2023 శాసనసభ ఎన్నికల్లో వారు మమ్మల్ని మంచి మనసుతో ఆశీర్వదించారని గుర్తు చేసుకున్నారు. వారి ఆశీర్వాదంతో రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం ఏర్పడిందన్నారు. ఆయన మరణం వారి అభిమానులకు తీరని దుఃఖాన్ని మిగిల్చిందన్నారు. వారి సేవలను కొనియాడుతూ వారి సందేశం స్ఫూర్తితో ముందుకెళ్లాలని సూచించారు
TG |తుమ్మబాల సేవలు చిరస్మణీయం సీఎం రేవంత్రెడ్డి
సమాజ నిర్మాణంలో ఆర్చ్ బిషప్ తుమ్మబాల ఎనలేని సేవలు అందించారని, ఆయన సేవలు చిరస్మరణీయమని సీఎం రేవంత్రెడ్డి కొనియాడారు.

Latest News
12 ఏళ్ల బీజేపీ ఏలుబడిలో 152 పేపర్ లీకేజీలు
‘పాండోరా బాక్స్’ అసలు రహస్యం ఇదేనా? ట్విస్టులతో కూడిన ఆసక్తికర కథ
శాన్ఫ్రాన్సిస్కోలో ఘనంగా M4M మూవీ 60 రోజుల విజయోత్సవం! ‘M4M-2’ సీక్వెల్
‘మిస్టర్ మిడిల్ క్లాస్’ అందరికీ కనెక్ట్ అవుతున్న పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్!
గోదావరి పుష్కరాలలోపే భద్రాద్రికి నూతన వైభవం: మంత్రి పొంగులేటి
వచ్చే మూడు నెలలకు ఒకేసారి రేషన్ : కేంద్రం కీలక నిర్ణయం
హాస్టల్ మెస్లోకి మొసలి.. అంతా పరుగో పరుగు!
సర్ పూర్తయ్యే వరకు గాంధీభవన్ రావద్దు : సీఎం రేవంత్ రెడ్డి
మా భూములకు కాదు… మా బతుకులకే కంచె వేస్తున్నారు !
జపాన్ ఓపెన్ టైటిల్ విజేత పీ.వీ.సింధు