విధాత: కరోనా కారణంగా తల్లిదండ్రులిద్దరినీ, లేదా ఒకరిని కోల్పోయిన దాదాపు లక్ష మంది పిల్లలకు రక్షణ అవసరమని ‘జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్’ (ఎన్సీపీసీఆర్) తెలిపింది. ఈ మేరకు సుప్రీంకోర్టులో జస్టిస్ ఎల్.నాగేశ్వరరావు, జస్టిస్ అనిరుద్ధబోస్ల ధర్మాసనానికి అదనపు ప్రమాణ పత్రం సమర్పించింది.