అమరావతి:మహిళా భద్రతపై క్యాంప్ కార్యాలయంలో సీఎం వైయస్.జగన్ అత్యున్నత స్ధాయి సమావేశం.
ఈ సందర్భంగా సీఎం వైయస్.జగన్ మాట్లాడుతూ మహిళా భద్రతకు- దిశ యాప్.మహిళా భద్రతపై ప్రత్యేక దృష్టిపెట్టాలి. దిశ యాప్పై పూర్తి చైతన్యం కలిగించాలి. దాన్ని ఎలా వాడాలన్నదానిపై అవగాహన కలిగించాలి.
అధికారులతో సీఎం జగన్ ఇంటింటికీ వెళ్లి అక్కచెల్లెమ్మల ఫోన్లలో యాప్ను డౌన్లోడ్ చేసేలా చూడాలి.
గ్రామ సచివాలయాల్లోని మహిళా పోలీసులు, వాలంటర్లతో అక్క చెల్లెమ్మలకు అవగాహన కలిగించాలి.
ముందుగా మహిళా పోలీసులకు, వాలంటీర్లకు శిక్షణ ఇచ్చి.. వారి ద్వారా అక్క చెల్లెమ్మలకు అవగాహన కలిగించాలి.
ప్రమాదకర పరిస్థితుల్లో ఈ యాప్ను ఎలా ఉపయోగించాలన్నదానిపై అక్క చెల్లెమ్మలకు చెప్పాలి,దీన్ని ఒక డ్రైవ్గా తీసుకొని చేపట్టాలని అధికారులకు స్పష్టం చేసిన సీఎం.అలాగే కాలేజీలు, విద్యాసంస్థల్లో కూడా విద్యార్థినులకు యాప్వినియోగంపై అవగాహన కలిగించాలి. ఈ చర్యల వల్ల దిశ యాప్ వినియోగం పెరుగుతుంది.అక్క చెల్లెమ్మలను ఆదుకునేలా ఆమేరకు వెనువెంటనే చర్యలు తీసుకునేలా యంత్రాంగం సిద్ధంకావాలి.దిశ పోలీస్స్టేషన్లు, స్థానిక పోలీస్స్టేషన్లు సత్వరమే స్పందించేలా వారిని సన్నద్ధంచేయాలి.
పోలీస్ స్టేషన్లలో అవసరమైనన్ని పెట్రోలింగ్ వాహనాలను సమకూర్చాలని అధికారులని సీఎం జగన్ ఆదేశించారు.
ఈ సమావేశానికి హోంమంత్రి మేకతోటి సుచరిత, డీజీపీ గౌతం సవాంగ్, ఇంటెలిజెన్స్ చీఫ్ కె.వి.రాజేంద్రనాథ్రెడ్డితో పాటు సీఎంఓ అధికారులు హాజరయ్యారు.
Readmore:ఐటీ పాలసీపై సీఎం వైఎస్ జగన్ సమీక్ష