విధాత: మూడు రాజధానుల బిల్లును ఏపీ ప్రభుత్వం ఉపసంహరించుకుంది. మూడు రాజధానుల బిల్లును ఉపసంహరించుకుంటున్నట్లు ఏపీ హైకోర్టుకు అడ్వకేట్ జనరల్ తెలిపింది. రాజధాని కేసుల విచారణ కోసం ఏర్పాటు చేసిన త్రిసభ్య ధర్మాసనానికి నివేదించిన అడ్వకేట్ జనరల్ తదుపరి విచారణను మధ్యాహ్నం 2:15 గంటలకి వాయిదా వేసిన ధర్మాసనం. వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులను కేబినెట్ రద్దు చేసింది. చట్టం రద్దుపై కాసేపట్లో అసెంబ్లీలో సీఎం జగన్ ప్రకటన చేస్తారని అడ్వకేట్ జనరల్ వెల్లడించింది.