గుంటూరు జిల్లా: టీడీపీ నాయకుడు నారా లోకేష్ వ్యాఖ్యలపై మండిపడ్డారు హోంమంత్రి సుచరిత.
టిడిపి అధికారంలోకి వస్తే ప్రతీకారం తీర్చుకుంటామని చెప్పడం హేయమైన చర్య అని ఒక వేళ టీడీపీ అధికారంలోకి వస్తే హత్యలు చేస్తామని చెప్పకనే చెబుతున్నట్లు ఉందన్నారు,టీడీపీ నాయకులు ఇలాంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం మంచిపద్ధతి కాదని వ్యక్తిగత కారణాలను కూడా టిడిపి రాజకీయ లబ్ధి కోసం వాడుకుంటోందన్న సుచరిత,టీడీపీ నాయకులకు శవ రాజకీయాలు చేయడం అలవాటైందని ప్రభుత్వంపై ఉద్దేశ్యపూర్వకంగా టీడీపీ ఆరోపణలు చేస్తోందని తమ ప్రభుత్వం అధికారంలో వచ్చిన తరువాత ఒక్క రాజకీయ హత్య కూడా జరగలేదని ఆమె స్పష్టంచేశారు.
కులం, మతం, ప్రాంతం, పార్టీ లని కూడా చూడకుండా ప్రతిఒక్కరికీ మంచి చేస్తున్న ఏకైక నాయకుడు సీఎం జగన్ గారు అని ఆమె కొనియాడారు.టీడీపీ ఇచ్చిన 600 హామీల్లో ఏ ఒక్కటి సరిగ్గా నెరవేర్చలేదు కనుకనే ఘోరమైన ఓటమి పొందారన్న హోం మినిస్టర్,టీడీపీ హయాంలో జరిగిన రాజకీయ హత్యల గురించి ప్రజలందరికీ తెలుసు ఈ రోజు సీఎం జగన్ మోహన్ రెడ్డి గారికి ప్రజల్లో వస్తున్న మంచి పేరును చూసి టీడీపీ ఓర్వలేక పోతోందన్నారు హోంమంత్రి సుచరిత.
Readmore:నారా లోకేష్ పై కేసు