విధాత:విజయనగరం: మాన్సన్ ట్రస్టు ఛైర్మన్గా మాజీ మంత్రి అశోక్గజపతిరాజు బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా మాన్సన్ ట్రస్టు ఈవో, కరస్పాండెంట్, అధికారుల గైర్హాజరుపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. సింహాచలం ఆలయ ఈవో కూడా తనని కలవడానికి ఇష్టపడలేదని అశోక్గజపతిరాజు అన్నారు. రామతీర్థానికి పంపిన చెక్కు వెనక్కి పంపి తనను మానసిక క్షోభకు గురిచేశారని ఆవేదన వ్యక్తం చేశారు. రామతీర్థంలో విగ్రహ పునఃప్రతిష్ట కార్యక్రమానికి తనను ఆహ్వానించలేదని అన్నారు.