విధాత: బద్వేలు ఉప ఎన్నికల్లో వైసిపి ఎన్నికల ఉల్లంఘనకు పాల్పడుతుందంటూ జనరల్ అబ్జర్వర్ ఐఎఎస్ అధికారి భీష్మ కుమార్ కు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు, ఎంపిలు జివీఎల్ నరశింహరావు, సిఎం రమేష్, బిజెపి సహా ఇంఛార్జి సునీల్ దేవధర్, జాతీయ కార్యదర్శి సత్యకుమార్, ఎమ్మెల్సీ మాధవ్, మాజీమంత్రి ఆదినారాయణ రెడ్డి ఫిర్యాదు చేశారు.
మా కార్యకర్తలపై వైసిపి తప్పుడు కేసులు భనాయిస్తుంది,పోలీసులు వారికి తొత్తులుగా మారారు.స్థానిక పోలీసులతో ఎన్నికలు నిర్వహిస్తే ఏకపక్షంగా జరిగే అవకాశం ఉంటుందని ఫిర్యాదు.ఇప్పటికే వైసీపీ నేతలకు తోత్తులుగా వ్యవహరిస్తూ బీజేపీ నేతలను బెదిరిస్తున్నారు.వాలెంటీర్ల ద్వారా ఓటర్లను ప్రలోభాలకు, బెదిరింపులకు గురి చేస్తున్నారు.డిల్లీలో కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసి పరిస్థితి పై వివరించామన్నారు.
స్పందించిన కేంద్ర ఎన్నికల సంఘం 15 ప్లటూన్ల ప్యారామిలిటరీ బలగాలను పంపారు.స్వేఛ్చాయుత వాతావరణం లో ఎన్నికలు జరగాలంటే కేంద్ర బలగాలు అవసరం.అధికార పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు భయానక వాతావరణాన్ని సృష్టిస్తున్నారు.ఏంజెట్లుగా కూర్చోవడానికి లేకుండా బెదిరిస్తున్నారు.ప్యారా మిలిటరీ బలగాలతో పేరేడ్ నిర్వహించి ఓటర్లలో నమ్మకం కలిగించాలి.మంచి పనులు చేశామని వైసీపీ నేతలు ఓట్లు అడగటం లేదు.బెదిరింపులు అరాచకాలతో గెలవాలని చూస్తున్నారు.
అందుకే వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతలు బద్వేల్ లో తిష్ట వేశారు.ఓటర్లకు విశ్వాసం కలిగించేలా ఎన్నిక నిర్వహించాల్సిన అవసరం ఉంది.వాలెంటీర్ల వ్యవస్థ ద్వారా ఓటర్లను ప్రభావితం చేస్తున్నారు.ప్రజల్లోకి వస్తే నిలదీస్తారనే సీఎం ఎన్నికల ప్రచారంలో దూరంగా ఉన్నారని తెలిపారు బీజేపి నేతలు.