సోషల్ మీడియాలో జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని కట్టడి చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భావిస్తోంది. ఈ మేరకు మంత్రులతో సబ్ కమిటీని ఏర్పాటు చేసింది. గురువారం జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ కేబినెట్ సబ్ కమిటీలో హోంశాఖ, పౌరసరఫరాలు, రెవిన్యూ, సమాచార శాఖ మంత్రులు సభ్యులుగా ఉంటారు. సోషల్ మీడియాలో దుష్ప్రచారానికి అడ్డుకట్టు వేయడానికి చట్టం తీసుకురానున్నారు. ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చంద్రబాబు ఆదేశించారు. ఇటీవల కాలంలో ఎరువుల కొరతతో పాటు, అమరావతిలో వరద నీరు వచ్చిందని సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం జరిగిందని రాష్ట్ర మంత్రులు, టీడీపీ నాయకులు మండిపడ్డారు. అమరావతిపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని అధికార పార్టీ మండిపడింది. సోషల్ మీడియాలో జరుగుతున్న తప్పుడు ప్రచారానికి అడ్డుకట్టు వేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఇందులో భాగంగానే చట్టం తీసుకురానున్నారు.
Chandrababu Naidu : సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం కట్టడికి కేబినెట్ సబ్ కమిటీ
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాన్ని కట్టడికి కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేసి చట్టం తీసుకురానుంది.

Latest News
మార్కెట్లోకి మళ్లీ రెనో డస్టర్ : ఆకర్షణీయమైన రూపం – అద్భుత భద్రత
బీజేపీకి ఆరూరి రాజీనామా.. తిరిగి బీఆరెస్లోకి..
కదిలే 'దుర్భేద్య దుర్గం'… మోదీ ప్రయాణించే కారు ప్రత్యేకతలివే.!
మేడారం గద్దెల ప్రాంగణంలో హాకా నృత్య ప్రదర్శన
ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ ఎంపీ సంతోష్ రావుకు నోటీసులు
చిన్నారి ప్రాణం తీసిన చైనా మాంజా
రెనాల్ట్ డస్టర్ ఈజ్ బ్యాక్ .. లుక్, ఫీచర్స్ అదుర్స్
తెలంగాణలో అధికార పక్షానికి మున్సి‘పోల్’ పరీక్ష
మన రక్తంలోని ఇనుము ఒకప్పుడు నక్షత్రంలో పుట్టిందా? శాస్త్రవేత్తలు చెబుతున్న అద్భుత నిజం..
నిత్యం కత్తులు దూసే రెండు సంస్థలు.. ఇంటి వసతి కోసం చేతులు కలిపాయి!