సోషల్ మీడియాలో జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని కట్టడి చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భావిస్తోంది. ఈ మేరకు మంత్రులతో సబ్ కమిటీని ఏర్పాటు చేసింది. గురువారం జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ కేబినెట్ సబ్ కమిటీలో హోంశాఖ, పౌరసరఫరాలు, రెవిన్యూ, సమాచార శాఖ మంత్రులు సభ్యులుగా ఉంటారు. సోషల్ మీడియాలో దుష్ప్రచారానికి అడ్డుకట్టు వేయడానికి చట్టం తీసుకురానున్నారు. ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చంద్రబాబు ఆదేశించారు. ఇటీవల కాలంలో ఎరువుల కొరతతో పాటు, అమరావతిలో వరద నీరు వచ్చిందని సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం జరిగిందని రాష్ట్ర మంత్రులు, టీడీపీ నాయకులు మండిపడ్డారు. అమరావతిపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని అధికార పార్టీ మండిపడింది. సోషల్ మీడియాలో జరుగుతున్న తప్పుడు ప్రచారానికి అడ్డుకట్టు వేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఇందులో భాగంగానే చట్టం తీసుకురానున్నారు.
Chandrababu Naidu : సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం కట్టడికి కేబినెట్ సబ్ కమిటీ
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాన్ని కట్టడికి కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేసి చట్టం తీసుకురానుంది.

Latest News
అవినీతి అనకొండ భీమ్ రెడ్డికి 14రోజుల రిమాండ్
తగ్గిన బంగారం ధరలు..స్థిరంగా వెండి
అయోధ్య విరాళాల చోరీ ఎఫెక్ట్.. చంపత్రాయ్ రాజీనామాకు ఆమోదం
బీఆర్ఎస్ను బద్నాం చేయడానికే కాళేశ్వరం పంపులు ఆన్ చేయడం లేదు: కేటీఆర్
గండిపేట నెత్తిన డాటా సెంటర్ కుంపటి
కన్నెపల్లి పంపులు ఆన్ చేయండి…ప్రమాదం జరిగితే బీఆర్ఎస్ పార్టీని రద్దు చేసుకుంటాం : మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి
బీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పనున్న ఎమ్మెల్యే మల్లారెడ్డి?
చిక్కిన మ్యాన్ ఈటర్ పెద్దపులి
పశువుల కాపరిపై సింహం దాడి…లైవ్ వీడియో
డేంజర్ ఫిష్ ఇది.. మత్స్యకారుడి వీడియో వైరల్