సోషల్ మీడియాలో జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని కట్టడి చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భావిస్తోంది. ఈ మేరకు మంత్రులతో సబ్ కమిటీని ఏర్పాటు చేసింది. గురువారం జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ కేబినెట్ సబ్ కమిటీలో హోంశాఖ, పౌరసరఫరాలు, రెవిన్యూ, సమాచార శాఖ మంత్రులు సభ్యులుగా ఉంటారు. సోషల్ మీడియాలో దుష్ప్రచారానికి అడ్డుకట్టు వేయడానికి చట్టం తీసుకురానున్నారు. ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చంద్రబాబు ఆదేశించారు. ఇటీవల కాలంలో ఎరువుల కొరతతో పాటు, అమరావతిలో వరద నీరు వచ్చిందని సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం జరిగిందని రాష్ట్ర మంత్రులు, టీడీపీ నాయకులు మండిపడ్డారు. అమరావతిపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని అధికార పార్టీ మండిపడింది. సోషల్ మీడియాలో జరుగుతున్న తప్పుడు ప్రచారానికి అడ్డుకట్టు వేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఇందులో భాగంగానే చట్టం తీసుకురానున్నారు.
Chandrababu Naidu : సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం కట్టడికి కేబినెట్ సబ్ కమిటీ
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాన్ని కట్టడికి కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేసి చట్టం తీసుకురానుంది.

Latest News
అఖండ 2 ఎఫెక్ట్తో లబోదిబోమంటున్న చిన్న సినిమా నిర్మాతలు..
గోవా ప్రమాద రెస్టారెంట్ యజమాని చేతిలో 42 షెల్ కంపెనీలు
తొలి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రారంభం.. సాయంత్రానికి ఫలితాలు
ఈశాన్య దిశలో పడక గదా..! దంపతుల మధ్య విడాకులు తప్పవట..!!
గురువారం రాశిఫలాలు.. ఆనందంగా ఈ రాశి వారి వైవాహిక జీవితం..!
బ్యాక్ లెస్ అందాలతో రెచ్చిపోయిన రకుల్ ప్రీత్
రాష్ట్రంలో రూ. 2,500 కోట్ల పెట్టుబడులు పెట్టనున్న అక్షత్ గ్రీన్టెక్ సంస్థ
ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తుపై సుప్రీంకోర్టు అసహనం
రేపటి పంచాయతీ ఎన్నికల పోలింగ్ కు సర్వం సిద్దం : ఈసీ
హీరోలు నా ముందు హీల్స్ వేసుకుంటారు..