సోషల్ మీడియాలో జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని కట్టడి చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భావిస్తోంది. ఈ మేరకు మంత్రులతో సబ్ కమిటీని ఏర్పాటు చేసింది. గురువారం జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ కేబినెట్ సబ్ కమిటీలో హోంశాఖ, పౌరసరఫరాలు, రెవిన్యూ, సమాచార శాఖ మంత్రులు సభ్యులుగా ఉంటారు. సోషల్ మీడియాలో దుష్ప్రచారానికి అడ్డుకట్టు వేయడానికి చట్టం తీసుకురానున్నారు. ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చంద్రబాబు ఆదేశించారు. ఇటీవల కాలంలో ఎరువుల కొరతతో పాటు, అమరావతిలో వరద నీరు వచ్చిందని సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం జరిగిందని రాష్ట్ర మంత్రులు, టీడీపీ నాయకులు మండిపడ్డారు. అమరావతిపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని అధికార పార్టీ మండిపడింది. సోషల్ మీడియాలో జరుగుతున్న తప్పుడు ప్రచారానికి అడ్డుకట్టు వేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఇందులో భాగంగానే చట్టం తీసుకురానున్నారు.
Chandrababu Naidu : సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం కట్టడికి కేబినెట్ సబ్ కమిటీ
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాన్ని కట్టడికి కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేసి చట్టం తీసుకురానుంది.

Latest News
శ్రీశైలం జలశయాన్ని పరిశీలించిన సీడబ్ల్యుసీ టెక్నికల్ కమిటీ
ఏపీ రాజధానిపై జగన్ నూతన ప్రతిపాదన
రాజధాని అమరావతి చట్టబద్ధత బిల్లుకు లోక్సభ ఆమోదం
తేయాకు తోటల్లో ప్రధాని మోదీ.. అస్సాం ఎన్నికల ప్రచార చిత్రం!
గంగా ఘాట్ లో పూజారి దుర్మార్గం..దేహశుద్ది
ఎల్పీజీ కొరతపై భగ్గుమన్న ఆటో కార్మికులు
వన్డే ఫార్మట్ లో న్యూజిలాండ్ ఉమెన్స్ టీమ్ వరల్డ్ రికార్డు!
సలేశ్వరంకు పోటెత్తిన భక్తులు
విలన్ రోల్ నుంచి తప్పుకున్న టోవినో థామస్
పెరిగిన బంగారం, వెండి ధరలు