శ్రీశైల పుణ్యక్షేత్రాన్ని దర్శించుకున్న (సీజేఐ) జస్టిస్ ఎన్వీ రమణ దంపతులు

విధాత‌:శ‌క్తిపీఠాల‌లో ఒక‌టి అయిన శ్రీశైలం భ్రమరాంబ, మల్లిఖార్జున స్వామి వార్లను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ ఎన్వీ రమణ దంపతులు దర్శించుకున్నారు. ఆలయంలో వారు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంతకుముందు ఆలయంలోని నంది నికేతన్‌ అతిథిగృహం వద్ద జస్టిస్‌ ఎన్వీ రమణ దంపతులకు ఏపీ దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌, ఎంపీ బ్రహ్మానందరెడ్డి, ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి, కర్నూలు జిల్లా కలెక్టర్‌ వీరపాండియన్‌, ఆలయ ఈవో కేఎస్‌ రామారావు తదితరులు పుష్పగుచ్ఛాలతో స్వాగతం పలికారు. […]

  • Publish Date - June 18, 2021 / 05:56 AM IST

విధాత‌:శ‌క్తిపీఠాల‌లో ఒక‌టి అయిన శ్రీశైలం భ్రమరాంబ, మల్లిఖార్జున స్వామి వార్లను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ ఎన్వీ రమణ దంపతులు దర్శించుకున్నారు.

ఆలయంలో వారు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంతకుముందు ఆలయంలోని నంది నికేతన్‌ అతిథిగృహం వద్ద జస్టిస్‌ ఎన్వీ రమణ దంపతులకు ఏపీ దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌, ఎంపీ బ్రహ్మానందరెడ్డి, ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి, కర్నూలు జిల్లా కలెక్టర్‌ వీరపాండియన్‌, ఆలయ ఈవో కేఎస్‌ రామారావు తదితరులు పుష్పగుచ్ఛాలతో స్వాగతం పలికారు.

అర్చకులు పూర్ణకుంభం, వేద మంత్రోచ్ఛరణలతో ఆలయంలోకి ఆహ్వానించారు.