విధాత,తూ.గో.జిల్లా: రాజోలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో వర్గపోరు చెలరేగుతుండడంతో తాడేపల్లి చేరిన రాజోలు వైసిపి పంచాయతీ.ఎమ్మెల్యే రాపాకవరప్రసాదరావు తీరు నచ్చటంలేదంటూ పార్టీ సీనియర్లు అధిష్టానానికి మొర.ఎమ్మెల్యేరాపాక,ఇన్చార్జి పెదపాటిఅమ్మాజీ,మాజీఇన్చార్జి బొంతురాజేశ్వరరావు ఎవరికి వారే పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నరంటూ మండిపాటు.
పార్టీలో ఎప్పటినుంచో పనిచేస్తున్న సీనియర్లకు గుర్తింపు ఇవ్వటం లేదంటూ ఆవేదన.ఎమ్మెల్యే రాపాక,జనసేన నుంచి వచ్చిన వారికే తగిన ప్రాధాన్యత ఇస్తున్నారంటూ సీనియర్లు ఆందోళన చెందుతున్నారు దీంతో పార్టీ పెద్దలకు రాజోలు నియోజకవర్గంలో జరుగుతున్న పరిస్థితులను వివరించనున్న సీనియర్లు.