అమరావతి:ఏపీలో ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్(ఈఏపీ సెట్-2021) నోటిఫికేషన్ విడుదలైంది. రాష్ట్ర ఉన్నత విద్యా మండలి తరఫున ఏపీ ఈఏపీ సెట్ కన్వీనర్ వి.రవీంద్ర నోటిఫికేషన్ను విడుదల చేశారు. నేటి నుండి(26వ తేదీ) నుంచి జూలై 25 వరకు ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా దరఖాస్తులను స్వీకరిస్తారు. ఆలస్య రుసుముతో ఆగస్టు 18 వరకు దరఖాస్తులను స్వీకరిస్తారు.ఈఏపీ సెట్ ఆగస్టు 19 నుంచి 25 వరకు ఆన్లైన్లో నిర్వహించనున్నారు