విధాత : జనసేన పోటీ చేస్తున్న 21 అసెంబ్లీ స్థానాల పరిధిలో, రెండు ఎంపీ స్థానాల పరిధిలో స్వతంత్రులకు గాజు గ్లాసు గుర్తు కేటాయించబోమని ఎన్నికల సంఘం ఏపీ హైకోర్టుకు నివేదించింది. ఈ నిర్ణయంతో జనసేనకు ఇబ్బందులు తొలుగుతాయని అభిప్రాయపడింది. ఈసీ ఆదేశాలపై ఏవైనా అభ్యంతరాలుంటే మరో పిటిషన్ వేయవచ్చని కోర్టు సూచిస్తూ విచారణను ముగించింది. పిటిషన్ను డిస్పోజల్ చేసింది. తమ పార్టీ పోటీలో లేనిచోట్ల స్వతంత్రులకు ‘గాజు గ్లాసు’ గుర్తును కేటాయించొద్దంటూ హైకోర్టును జనసేన ఆశ్రయించింది. మంగళవారం దీనిపై విచారణ జరిగింది. 24 గంటల్లో ఈ అంశంపై నిర్ణయం తీసుకుంటామని కేంద్ర ఎన్నికల సంఘం తరపు సీనియర్ న్యాయవాది అవినాశ్ దేశాయ్ హైకోర్టుకు తెలిపారు. ఆ మేరకు నేడు ఈసీ నివేదిక అందజేశారు.
జనసేన పోటీ స్థానాల్లో ఇతరులకు గాజు గ్లాసు గుర్తు కేటాయించం.. హైకోర్టుకు ఈసీ వెల్లడి
జనసేన పోటీ చేస్తున్న 21 అసెంబ్లీ స్థానాల పరిధిలో, రెండు ఎంపీ స్థానాల పరిధిలో స్వతంత్రులకు గాజు గ్లాసు గుర్తు కేటాయించబోమని ఎన్నికల సంఘం ఏపీ హైకోర్టుకు నివేదించింది. ఈ నిర్ణయంతో జనసేనకు ఇబ్బందులు తొలుగుతాయని అభిప్రాయపడింది

Latest News
అమరావతి అంశంపై మౌనం పాటిస్తున్న టాలీవుడ్ హీరోలు..
మగబిడ్డకు జన్మనిచ్చిన 14 ఏళ్ల బాలిక..!
నన్ను తాకాలంటే 90 లక్షలు ఇవ్వాల్సిందే.. శోభనం గదిలో పెళ్లికూతురి డిమాండ్.. తర్వాత ఏమైందంటే.!
కన్యాకుమారిలో ఎమోషనల్ మూమెంట్స్..
వివాదం వల్ల వరదలా సబ్స్క్రైబర్లు..
రూ.15 వేలలోనే ఊటీ ట్రిప్.. ఐఆర్సీటీసీ స్పెషల్ టూర్ ప్యాకేజీ!
మీ కుక్కర్ విజిల్ రావట్లేదా.. ఈ ట్రిక్స్ తెలిస్తే మీరే చిటికెలో బాగుచేసుకోవచ్చు!
ఎన్సీఎల్లో 577 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. లాస్ట్ డేట్ ఎప్పుడంటే..!
బుధవారం రాశిఫలాలు.. ఈ రాశి వారికి జీవిత భాగస్వామితో అకారణ వివాదాలు..!
అధికారం కోసమా? అంతర్మథనమా! మళ్లీ టీఆర్ఎస్గా పేరు మార్పు ఆలోచన వెనుక కవిత ఎఫెక్ట్?