విధాత : జనసేన పోటీ చేస్తున్న 21 అసెంబ్లీ స్థానాల పరిధిలో, రెండు ఎంపీ స్థానాల పరిధిలో స్వతంత్రులకు గాజు గ్లాసు గుర్తు కేటాయించబోమని ఎన్నికల సంఘం ఏపీ హైకోర్టుకు నివేదించింది. ఈ నిర్ణయంతో జనసేనకు ఇబ్బందులు తొలుగుతాయని అభిప్రాయపడింది. ఈసీ ఆదేశాలపై ఏవైనా అభ్యంతరాలుంటే మరో పిటిషన్ వేయవచ్చని కోర్టు సూచిస్తూ విచారణను ముగించింది. పిటిషన్ను డిస్పోజల్ చేసింది. తమ పార్టీ పోటీలో లేనిచోట్ల స్వతంత్రులకు ‘గాజు గ్లాసు’ గుర్తును కేటాయించొద్దంటూ హైకోర్టును జనసేన ఆశ్రయించింది. మంగళవారం దీనిపై విచారణ జరిగింది. 24 గంటల్లో ఈ అంశంపై నిర్ణయం తీసుకుంటామని కేంద్ర ఎన్నికల సంఘం తరపు సీనియర్ న్యాయవాది అవినాశ్ దేశాయ్ హైకోర్టుకు తెలిపారు. ఆ మేరకు నేడు ఈసీ నివేదిక అందజేశారు.
జనసేన పోటీ స్థానాల్లో ఇతరులకు గాజు గ్లాసు గుర్తు కేటాయించం.. హైకోర్టుకు ఈసీ వెల్లడి
జనసేన పోటీ చేస్తున్న 21 అసెంబ్లీ స్థానాల పరిధిలో, రెండు ఎంపీ స్థానాల పరిధిలో స్వతంత్రులకు గాజు గ్లాసు గుర్తు కేటాయించబోమని ఎన్నికల సంఘం ఏపీ హైకోర్టుకు నివేదించింది. ఈ నిర్ణయంతో జనసేనకు ఇబ్బందులు తొలుగుతాయని అభిప్రాయపడింది

Latest News
తక్కువ ధర, ప్రీమియం ఫీచర్లు : మోటరోలా ఎడ్జ్ 70 / 70 ప్రో వివరాలివిగో..!
దక్షిణాఫ్రికాతో ఆఖరి మ్యాచ్ : భారత్ భారీ విజయం — సిరీస్ కైవసం
అనన్య నాగళ్ల థండర్ థైస్ షో.. మామూలుగా లేదు భయ్యా!
చలికాలంలో ఇళ్లలో హీటర్స్ వాడటం ఎంత సేఫ్?
అమ్మ పాడే జోల పాటల్లో ఇంత గొప్పదనం ఉందా?
విమాన టికెట్ రేట్లపై సీలింగ్.. కేంద్ర విమానయాన శాఖ కీలక నిర్ణయం
ఐజేయూ నేతలను సత్కరించిన గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్
విశాఖ వన్డేలో డికాక్ సెంచరీ..భారత్ టార్గెట్ 271 పరుగులు
మోదీ–పుతిన్ భేటీలో అందరి దృష్టిని ఆకర్షించిన ఓ అందం
వాళ్లు వస్తే మంచి రోజులు కాదు..ముంచే రోజులొస్తాయి: సీఎం రేవంత్ రెడ్డి