విధాత : జనసేన పోటీ చేస్తున్న 21 అసెంబ్లీ స్థానాల పరిధిలో, రెండు ఎంపీ స్థానాల పరిధిలో స్వతంత్రులకు గాజు గ్లాసు గుర్తు కేటాయించబోమని ఎన్నికల సంఘం ఏపీ హైకోర్టుకు నివేదించింది. ఈ నిర్ణయంతో జనసేనకు ఇబ్బందులు తొలుగుతాయని అభిప్రాయపడింది. ఈసీ ఆదేశాలపై ఏవైనా అభ్యంతరాలుంటే మరో పిటిషన్ వేయవచ్చని కోర్టు సూచిస్తూ విచారణను ముగించింది. పిటిషన్ను డిస్పోజల్ చేసింది. తమ పార్టీ పోటీలో లేనిచోట్ల స్వతంత్రులకు ‘గాజు గ్లాసు’ గుర్తును కేటాయించొద్దంటూ హైకోర్టును జనసేన ఆశ్రయించింది. మంగళవారం దీనిపై విచారణ జరిగింది. 24 గంటల్లో ఈ అంశంపై నిర్ణయం తీసుకుంటామని కేంద్ర ఎన్నికల సంఘం తరపు సీనియర్ న్యాయవాది అవినాశ్ దేశాయ్ హైకోర్టుకు తెలిపారు. ఆ మేరకు నేడు ఈసీ నివేదిక అందజేశారు.
జనసేన పోటీ స్థానాల్లో ఇతరులకు గాజు గ్లాసు గుర్తు కేటాయించం.. హైకోర్టుకు ఈసీ వెల్లడి
జనసేన పోటీ చేస్తున్న 21 అసెంబ్లీ స్థానాల పరిధిలో, రెండు ఎంపీ స్థానాల పరిధిలో స్వతంత్రులకు గాజు గ్లాసు గుర్తు కేటాయించబోమని ఎన్నికల సంఘం ఏపీ హైకోర్టుకు నివేదించింది. ఈ నిర్ణయంతో జనసేనకు ఇబ్బందులు తొలుగుతాయని అభిప్రాయపడింది

Latest News
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ శాఖ ఖాళీ!
ఆఫీసులో డీజీపీ ర్యాంకు అధికారి రాసలీలలు..వీడియో వైరల్
మంత్రి కోమటిరెడ్డికి వరుస షాక్ లు.. సుశీ ఇన్ ఫ్రాపై సీబీఐ కేసు !
ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు శుభవార్త! టీజీ ఔట్సోర్సింగ్ కార్పొరేషన్ ఏర్పాటు యత్నాల్లో సర్కార్?
మన దేశంలో సరస్సులకు ఏ నగరం ప్రసిద్ధి చెందిందో తెలుసా..? ఆ నగర ప్రత్యేకతలు
కాళేశ్వరం ఘోష్ కమిషన్ రిపోర్టు కేసు విచారణ వచ్చే నెల 25కు వాయిదా
సీనియర్ హీరోల పట్ల ఎన్టీఆర్ వినయం..
కుక్క కాటు మరణాలపైనే రచ్చ ఎందుకు? : రేణు దేశాయ్ ఫైర్
హార్వర్డ్ విద్యార్థిగా సీఎం రేవంత్ రెడ్డి కొత్త చరిత్ర
స్పీకర్ ప్రసాద్ కు సుప్రీంకోర్టు కోర్టు ధిక్కరణ నోటీసులు