విధాత:ఖతర్ దేశంలో మనీలాండరింగ్ కు పాల్పడిన విశాఖ వాసి ఆస్తులు జప్తు చేసిన ఈడీ
విశాఖకు చెందిన సుబ్రహ్మణ్య శ్రీనివాస్ పిన్నిటి ఆస్తులు జప్తు చేసిన ఈడీ
డోహ్రాలోని అల్ మీరా కన్జూమర్ గూడ్స్ కంపెనీలో ఉన్నతాధికారిగా పని చేస్తున్న శ్రీనివాస్ వినియోగదారుల నుంచి లంచాలు తీసుకున్నట్లు శ్రీనివాస్ పై ఖతర్ లో కేసు నమోదైంది. లంచం సొమ్మును భారత్ లోని బ్యాంకులకు మళ్లించినట్లు గుర్తించిన ఖతర్ దర్యాప్తు సంస్థ దర్యాప్తునకు, సొమ్ము జప్తునకు సహకరించాలని భారత్ ను కోరింది దానితో విశాఖలోని సుబ్రహ్మణ్య శ్రీనివాస్ ఇంట్లో ఈడీ సోదాలు చేసింది.విశాఖ, విజయనగరంలో 3 ప్లాట్లు, మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడులు గుర్తించిన ఈడీ,ఖతర్ దేశం వినతి మేరకు రూ.88 లక్షల ఆస్తులు జప్తు చేసిన ఈడీ
Read more:విశాఖ కేంద్రంగా ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ఏర్పాటు ఖాయం