జీవోఐఆర్‌లో జీవోలు ఉంచడం లేదన్న పిటిషన్లపై విచారణ

విధాత‌: జీవోఐఆర్ లో జీవోలు ఉంచటం లేదని దాఖలైన పిటిషన్లపై హైకోర్టులో విచారణ జరిగింది. సమాచారం ఇవ్వకుండా ప్రభుత్వం తప్పించుకుంటోందని పిటిషన్ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. పూర్తి వివరాలు ఇచ్చేందుకు సమయం కావాలని ప్రభుత్వ న్యాయవాది కోరారు.ఇరువరి వాదనలు విన్న ధర్మాసనం.. తదుపరి విచారణను వారానికి వాయిదా వేసింది. జీవోలను వెబ్‌సైట్లో ఉంచడకపోవడాన్ని సవాలు చేస్తూ.. జీఎంఎన్‌ఎస్‌ దేవి, గుంటూరు జిల్లాకు చెందిన కోమటినేని శ్రీనివాసరావు, న్యాయవాది ఎస్‌ఆర్‌ ఆంజనేయులు హైకోర్టులో వేర్వేరుగా ప్రజాహిత వ్యాజ్యాలు […]

  • Publish Date - September 23, 2021 / 02:54 AM IST

విధాత‌: జీవోఐఆర్ లో జీవోలు ఉంచటం లేదని దాఖలైన పిటిషన్లపై హైకోర్టులో విచారణ జరిగింది. సమాచారం ఇవ్వకుండా ప్రభుత్వం తప్పించుకుంటోందని పిటిషన్ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. పూర్తి వివరాలు ఇచ్చేందుకు సమయం కావాలని ప్రభుత్వ న్యాయవాది కోరారు.ఇరువరి వాదనలు విన్న ధర్మాసనం.. తదుపరి విచారణను వారానికి వాయిదా వేసింది. జీవోలను వెబ్‌సైట్లో ఉంచడకపోవడాన్ని సవాలు చేస్తూ.. జీఎంఎన్‌ఎస్‌ దేవి, గుంటూరు జిల్లాకు చెందిన కోమటినేని శ్రీనివాసరావు, న్యాయవాది ఎస్‌ఆర్‌ ఆంజనేయులు హైకోర్టులో వేర్వేరుగా ప్రజాహిత వ్యాజ్యాలు దాఖలు చేశారు. ప్రభుత్వ నిర్ణయం సమాచార హక్కు చట్ట నిబంధనలకు విరుద్ధం అన్నారు.ప్రభుత్వ రోజువారీ కార్యకలాపాలను తెలుసుకునే ప్రాథమిక హక్కు ప్రజలకు ఉందన్నారు.2008 నుంచి కొనసాగుతున్న విధానాన్ని నిలిపివేయడం సరికాదన్నారు.