విధాత,అమరావతి : ఇండియన్ ఎయిర్ ఫోర్సులో వివిధ ఉపాధి అవకాశాలపై త్వరలో నిర్వహించనున్న రిక్రూట్మెంట్ ర్యాలీలకు విస్తృత ప్రచారం కల్పించి యువతను అన్ని విధాలా ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యానాధ్ దాస్ చెప్పారు. ఈ మేరకు గురువారం ఆంధ్రప్రదేశ్, తెలంగాణా 12 ఎయిర్మెన్ సెలక్షన్ సెంటర్ సికింద్రాబాదు కమాండింగ్ అధికారి వింగ్ కమాండర్ ఎస్.శ్రీచైతన్య నేతృత్వంలోని బృందం అమరావతి సచివాలయంలో సీఎస్ను కలిశారు. ఈసందర్భంగా ఇంటర్మీడియట్ అనంతరం ఎయిర్ ఫోర్సులో చేరేందుకు గల వివిధ అవకాశాలపై వారు సిఎస్తో చర్చించారు. ఇందుకు సంబంధించి త్వరలో రాష్ట్రంలోని కొన్ని ఎంపిక చేసిన జిల్లాల్లో ఎయిర్ మెన్ సెలకక్షన్ కు సంబంధించిన ర్యాలీలను నిర్వహించనున్నామని అందుకు రాష్ట్ర ప్రభుత్వ సహకారం అవసరమని వింగ్ కమాండర్ చైతన్య సిఎస్కు విజ్ణప్తి చేశారు. దానిపై సిఎస్ ఆదిత్యానాధ్ దాస్ మాట్లాడుతూ త్వరలో చేపట్టనున్న ఎయిర్ మెన్ సెలక్షన్ రిక్రూట్మెంట్ ర్యాలీకి విస్తృత ప్రచారం కల్పించి అధిక సంఖ్యలో యువత ఎయిర్ ఫోర్సులో చేరేలా కృషి చేస్తామని న్నారు. వివిధ జిల్లాల కలక్టర్లకు తగిన ఆదేశాలు జారీ చేయడంతో పాటు కళాశాల, ఉన్నత విద్యాశాఖల కార్యదర్శులకు కూడా తగిన ఆదేశాలు జారీ చేయడం జరుగుతుందని ఆయన చెప్పారు. సమావేశంలో 12 ఎయిర్మెన్ సెలక్షన్ సెంటర్ ప్రతినిధులు పాల్గొన్నారు.
ఇండియన్ ఎయిర్ ఫోర్సులో.. ఉపాధి అవకాశాలపై త్వరలో రిక్రూట్మెంట్ ర్యాలీలు
<p>విధాత,అమరావతి : ఇండియన్ ఎయిర్ ఫోర్సులో వివిధ ఉపాధి అవకాశాలపై త్వరలో నిర్వహించనున్న రిక్రూట్మెంట్ ర్యాలీలకు విస్తృత ప్రచారం కల్పించి యువతను అన్ని విధాలా ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యానాధ్ దాస్ చెప్పారు. ఈ మేరకు గురువారం ఆంధ్రప్రదేశ్, తెలంగాణా 12 ఎయిర్మెన్ సెలక్షన్ సెంటర్ సికింద్రాబాదు కమాండింగ్ అధికారి వింగ్ కమాండర్ ఎస్.శ్రీచైతన్య నేతృత్వంలోని బృందం అమరావతి సచివాలయంలో సీఎస్ను కలిశారు. ఈసందర్భంగా ఇంటర్మీడియట్ అనంతరం ఎయిర్ ఫోర్సులో చేరేందుకు గల […]</p>
Latest News

ఏపీ మాజీ డిప్యూటీ సీఎం మృతి
ఈనెల 17 న హైదరాబాద్లో ఉపరాష్ట్రపతి పర్యటన
విద్యా, పర్యాటక, వైద్య రంగాల్లో కలిసి పనిచేద్దాం.. ప్రిన్స్ రహీమ్ ఆగా ఖాన్-vకు సీఎం విజ్ఞప్తి
ఐవీ కొనేది రూ.11కు.. రోగులకు అమ్మేది మాత్రం రూ.325కు
నేటి నుంచి తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు
ఖైరతాబాద్ గణేశుడికి గవర్నర్ దంపతుల తొలి పూజలు
ప్రకృతిని కాపాడుదాం.. చవితి ప్రత్యేకత ను చాటుదాం : జర్నలిస్ట్ గిరి ప్రసాద్ సోముల
పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది
ఘనంగా ‘జై గౌరీపుత్ర గణేశా’ ఆడియో, ట్రైలర్ ఆవిష్కరణ*
పోతునూరు రైతుల “వరి” గోస