లోక్ సభలో రఘురామ, మిథున్‌ రెడ్డి ఢీ అంటే ఢీ

విధాత: ఈ రోజు లోక్ సభ సమావేశాల్లో యుద్ద వాతావరణం నెలకొంది. సమావేశాల్లో భాగంగా జీరో అవర్ లో రఘురామ, మిధున్ రెడ్డి ఢీ అంటే ఢీ అనుకున్నారు. రైతుల మహా పాదయాత్రకు పోలీసుల అడ్డంకులు కల్పించడాన్ని రఘురామకృష్ణంరాజు తప్పు పట్టారు. రైతులు రాజధాని కోసం 33 వేల ఎకరాలు స్వచ్ఛందంగా ఇచ్చారని, గాంధేయ పద్దతిలో మహా పాదయాత్ర చేస్తున్న రైతులను అడ్డుకోవడం అన్యాయమని, హైకోర్టు నుంచి అనుమతులు ఉన్నా పోలీసులు అడ్డుకోవడం, తీవ్రంగా హింసించడం దురదృష్టకరమని […]

  • Publish Date - December 6, 2021 / 10:16 AM IST

విధాత: ఈ రోజు లోక్ సభ సమావేశాల్లో యుద్ద వాతావరణం నెలకొంది. సమావేశాల్లో భాగంగా జీరో అవర్ లో రఘురామ, మిధున్ రెడ్డి ఢీ అంటే ఢీ అనుకున్నారు. రైతుల మహా పాదయాత్రకు పోలీసుల అడ్డంకులు కల్పించడాన్ని రఘురామకృష్ణంరాజు తప్పు పట్టారు.

రైతులు రాజధాని కోసం 33 వేల ఎకరాలు స్వచ్ఛందంగా ఇచ్చారని, గాంధేయ పద్దతిలో మహా పాదయాత్ర చేస్తున్న రైతులను అడ్డుకోవడం అన్యాయమని, హైకోర్టు నుంచి అనుమతులు ఉన్నా పోలీసులు అడ్డుకోవడం, తీవ్రంగా హింసించడం దురదృష్టకరమని ఎంపీ రఘురామ అన్నారు. శాంతి భద్రతలు రాష్ట్ర పరిధిలోని అంశమైనా అక్కడ శాంతి భద్రతలు క్షీణించాయని ప్రజల ప్రాధమిక హక్కులను కూడా పోలీసులు హరిస్తున్నారని ఎంపీ రఘురామ పేర్కొన్నారు.

కాగా రఘురామ వ్యాఖ్యలను వైసీపీ లోక్ సభ పక్ష నేత మిధున్ రెడ్డి ఖండించారు. సీబీఐ కేసుల నుంచి బయటపడేందుకు ఎంపీ రఘురామ అధికార బీజేపీలో చేరేందుకు తహతహలాడుతున్నాడని , ఎంపీ రఘురామపై ఉన్న సీబీఐ కేసులపై వేగంగా దర్యాప్తు నిర్వహించాలని మిధున్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వైసీపీ ఎంపీలు రఘురామ ప్రసంగాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు.