విధాత: రాష్ట్ర బ్రాండ్ ఇమేజ్ను దెబ్బతీసేందుకే చంద్రబాబు గంజాయి, డ్రగ్స్ అంటూ దుష్ప్రచారం చేస్తున్నారని ఎమ్మెల్సీ అప్పిరెడ్డిమండిపడ్డారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని ఉద్దేశించి బూతులు మాట్లాడటాన్ని నిరసిస్తూ వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో గుంటూరు మార్కెట్ సెంటర్ లోని జనాగ్రహ దీక్ష నేటితో దీక్ష విరమించారు. గడిచిన రెండు రోజులుగా దీక్షలో కూర్చున్న వైసీపీ శ్రేణులు ఎమ్మెల్సీ అప్పి రెడ్డికి నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమించారు. ఈ సందర్భంగా అప్పిరెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి చంద్రబాబు బేషరతుగా క్షమాపణ చెప్పాలనన్నారు.