ఢిల్లీలో కొనసాగుతున్న ముఖ్యమంత్రి వైయస్‌.జగన్‌ పర్యటన

కేంద్రమంత్రులు గజేంద్రసింగ్‌ షెకావత్, ప్రకాష్‌ జవదేకర్‌లతో సీఎం సమావేశం – రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై కేంద్ర మంత్రులతో చర్చలు.– కేంద్ర జలశక్తి శాఖమంత్రి గజేంద్ర సింగ్‌ షెకావత్, మరోకేంద్ర మంత్రి ప్రకాష్‌ జవదేకర్‌లతో చర్చలు.– పోలవరం ప్రాజెక్టు అంశంపై జలశక్తి శాఖమంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌తో విస్తృత చర్చ.– పోలవరం ప్రాజెక్టును సకాలంలో పూర్తిచేయాల్సి అంశాన్ని గజేంద్ర సింగ్‌ షెకావత్‌ ఎదుట పునరుద్ఘాటించిన సీఎం వైయస్‌.జగన్‌.– పోలవరం పీపీఏతోపాటు, కేంద్ర జలమండలి సిఫార్సులతోపాటు, కేంద్ర జలశాఖకు చెందిన […]

  • Publish Date - June 10, 2021 / 12:28 PM IST

కేంద్రమంత్రులు గజేంద్రసింగ్‌ షెకావత్, ప్రకాష్‌ జవదేకర్‌లతో సీఎం సమావేశం

– రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై కేంద్ర మంత్రులతో చర్చలు.
– కేంద్ర జలశక్తి శాఖమంత్రి గజేంద్ర సింగ్‌ షెకావత్, మరోకేంద్ర మంత్రి ప్రకాష్‌ జవదేకర్‌లతో చర్చలు.
– పోలవరం ప్రాజెక్టు అంశంపై జలశక్తి శాఖమంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌తో విస్తృత చర్చ.
– పోలవరం ప్రాజెక్టును సకాలంలో పూర్తిచేయాల్సి అంశాన్ని గజేంద్ర సింగ్‌ షెకావత్‌ ఎదుట పునరుద్ఘాటించిన సీఎం వైయస్‌.జగన్‌.
– పోలవరం పీపీఏతోపాటు, కేంద్ర జలమండలి సిఫార్సులతోపాటు, కేంద్ర జలశాఖకు చెందిన సాంకేతిక సలహామండలి ( టెక్నికల్‌అడ్వైజరీ కమిటీ– టీఏసీ) అంగీకరించిన విధంగా 2017–18 ధరల సూచీ ప్రకారం
రూ. 55,656.87 కోట్ల పోలవరం ప్రాజెక్టు అంచనా వ్యయానికి ఆమోదం తెలిపాలని కోరిన ముఖ్యమంత్రి.
– 2022 జూన్‌నాటికి ప్రాజెక్టు పనులతోపాటు, భూసేకరణ–పునరావాస పనులను పూర్తిచేయాలన్న లక్ష్యంతో ముందుకు వెళ్తున్నామని, వెంటనే ఈ అంచనాలకు ఆమోదం తెలపాలన్న సీఎం.
– జాతీయ ప్రాజెక్టుల విషయంలో ఉన్న మార్గదర్శకాల ప్రకారం వాటర్‌ సప్లైని కూడా ఇరిగేషన్‌ ప్రాజెక్టులో భాగంగా చూడాలని కోరిన సీఎం.

– రాష్ట్ర ప్రభుత్వ వనరులనుంచి పోలవరం ప్రాజెక్టుకోసం ఖర్చు చేస్తున్నామని, జాప్యం లేకుండా ఆ నిధులను రీయింబర్స్‌ చేయాలన్న సీఎం. రీయింబర్స్‌మెంట్‌ను కాంపోనెంట్‌ వైజ్‌ ఎలిజిబిలిటీకి పరిమితం చేయవద్దన్న సీఎం.
– 2013 రైట్‌ టు ఫెయిర్‌ కాంపన్‌సేషన్, ట్రాన్స్‌పరెంటీ ఇన్‌ ల్యాండ్‌ అక్విజిషన్, రీహేబ్‌లిటేషన్‌ అంyŠ రీ సెటిల్‌మెంట్‌ చట్టం ప్రకారం పునరావాస పనులకు రీయింబర్స్‌ చేయాలని కోరిన సీఎం.
– పోలవరం ప్రాజెక్టు అథారిటీ కార్యాలయాన్ని హైదరాబాద్‌ నుంచి రాజమహేంద్రవరం తరలించాలని కోరిన సీఎం. హైదరాబాద్‌లో ఇప్పుడు సచివాలయ కార్యకలాపాలు లేవని, ప్రాజెక్టు పర్యవేక్షణ, పరిశీలనకోసం సుదూరంలో ఉన్న హైదరాబాద్‌ నుంచి రావడం కష్టం అవుతోందని, అందుకే పీపీఏ కార్యాలయాన్ని రాజమండ్రి తరలించాలన్న సీఎం.
– అంతకుముందు కేంద్ర మంత్రి ప్రకాష్‌ జవదేకర్‌తో సమావేశమైన ముఖ్యమంత్రి.
– పోలవరం ప్రాజెక్టులో స్టాకింగ్‌ పనులకు సంబంధించిన పర్యావరణ అనుమతుల్లో చిన్న చిన్న అంశాలు మిగిలిపోయాయని వెంటనే పరిష్కరించాలని కోరిన సీఎం.