కాంగ్రెస్ పార్టీ పునాదులు కదిలిపోయాయి.. బీజేపీ కి అడ్రెస్ లేదు..

విధాత‌: బద్వేలు ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి కి మద్దతుగా ప్రచారం చేస్తున్నాం కాంగ్రెస్ పార్టీ పునాదులు కదిలిపోయాయి.. బీజేపీ కి అడ్రెస్ లేదు.. ఇలాంటి పార్టీలతో ఎన్నికల్లో పోటీ చేస్తున్నామ‌న్నారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. మా ముఖ్యమంత్రి కులాలు, మతాలు, ప్రాంతాలు , పార్టీలు చూడకుండా సంక్షేమం అందిస్తున్నారు..అడ్రెస్ లేని పార్టీలు, గల్లంతయిన పార్టీలు ఏ అర్హతతో ఓట్లు అడుగుతారు.బద్వేలు నియోజకవర్గ అభివృద్ధికి రూ.792 కోట్లు కేటాయించాము.తాగునీటి సమస్య శాశ్విత పరిష్కరం కోసం బ్రహ్మం సాగర్ ద్వారా […]

  • Publish Date - October 9, 2021 / 11:59 AM IST

విధాత‌: బద్వేలు ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి కి మద్దతుగా ప్రచారం చేస్తున్నాం కాంగ్రెస్ పార్టీ పునాదులు కదిలిపోయాయి.. బీజేపీ కి అడ్రెస్ లేదు.. ఇలాంటి పార్టీలతో ఎన్నికల్లో పోటీ చేస్తున్నామ‌న్నారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.

మా ముఖ్యమంత్రి కులాలు, మతాలు, ప్రాంతాలు , పార్టీలు చూడకుండా సంక్షేమం అందిస్తున్నారు..అడ్రెస్ లేని పార్టీలు, గల్లంతయిన పార్టీలు ఏ అర్హతతో ఓట్లు అడుగుతారు.బద్వేలు నియోజకవర్గ అభివృద్ధికి రూ.792 కోట్లు కేటాయించాము.తాగునీటి సమస్య శాశ్విత పరిష్కరం కోసం బ్రహ్మం సాగర్ ద్వారా పనులు చేస్తున్నాం.

నియోజకవర్గ పరిధిలో ఐదు వేల ఇల్లు ఇచ్చాం,నియోజకవర్గ అభివృద్ధికి మా ప్రభుత్వం కట్టుబడి ఉంది.మేము చేసిన అభివృద్ధి,అందించిన సంక్షేమం చెప్పేందుకు ప్రతి ఇంటికి వెళతాం,కాంగ్రెస్ పార్టీ , టీడీపీ ఇంటికి వెళతాం..అడిగే అర్హత మాకు మాత్రమే ఉందని వెల్ల‌డించారు.

సంక్షేమం , అభివృద్ధి రెండు కళ్ళుగా మా ముఖ్యమంత్రి సమపాళ్లతో అభివృద్ధి చేస్తున్నారు బీజేపీ నేతలు అసత్య ప్రచారం చేస్తున్నారు,75 వేల కోట్లు అప్పులు తెచ్చామని అంటున్నారు.. 75 కాదు లక్ష కోట్లు సంక్షేమ పథకాల కోసం ఇచ్చాం.

అప్పులు ఎక్కువ చేస్తున్నారని ఆరోపిస్తున్నారు, కరోనా సంక్షోభంలో ప్రజలకు అండగా నిలిచాము.నోబెల్ గ్రహీత అమర్థ్య సేన్ చెప్పినట్లు హెలికాప్టర్ మనీ ద్వారా కరోనా సంక్షోభంలో అందరికీ అదుకున్నాం..కేంద్రం కంటే GSDP లో ముందున్నాం.. జీడీపీ లో రాష్ట్రమే ముందుంది.

హోమ్ మంత్రి క్రిస్టయన్ అని తప్పుడు పెరచారం.అభూత కల్పనలు చెప్పడంలో ఆరితేరారు.తిరుపతి ఉపఎన్నికల్లో కూడా బీజేపీ నేతలు తప్పడు ప్రచారాలు చేసి మభ్యపెట్టే ప్రయత్నాలు చేసారు.ఎన్నికలు సాఫీగా జరుపుకోవాలని బీజేపీ కి లేదు,దేవాలయాలు కొట్టేస్తున్నారని ఆరోపించారు.టీడీపీ ప్రభుత్వం లో బీజేపీ పార్టీ దేవాదాయశాఖ మంత్రిగా ఉండి విజయవాడలో దేవాలయాలను విధ్వసం చేశారు.

మాది సెక్యూలర్ పార్టీ.. మాకు కులాలు , మతాలు లేవు.. హిందు మతం అడ్డం పెట్టుకొని బీజేపీ రాజకీయం,అన్ని మతాలకు సమంగా చూస్తాం.ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై మతమార్పిదులని అసత్య ప్రచారం.ఓట్లు లేవు కాబట్టి ఎదో ఒక రచ్చ చేయడం ద్వారా రాజకీయ ప్రయోజనం పొందాలనే బీజేపీ ప్రయత్నం.బీజేపీ నేత సునీల్ థియోదర్ ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు.టీడీపీ నుంచి వెళ్లిన తాబేదార్లు రాసిచ్చిన స్క్రిప్ట్ చదువుతున్నాడు.. మతతత్వం పేరుతో రెచ్చకొట్టే ప్రయత్నాలు మాపై ఆరోపణలు చేయడం మీ తెలివితక్కువ తనం,ఆరోపణలు చేసేముందు తెలుసుకొని మాట్లాడు అని పేర్కొన్నారు.