సాక్షి మీడియాకు రఘురామ లీగల్‌ నోటీస్‌

విధాత,ఢిల్లీ: సాక్షి మీడియాకు ఎంపీ రఘురామకృష్ణరాజు లీగల్‌ నోటీసులిచ్చారు. తన ప్రతిష్టకు భంగం కలిగించినందుకు బేషరతు క్షమాపణ చెప్పాలని నోటీసులో పేర్కొన్నారు. పదిహేను రోజుల్లో నోటీసుకు సమధానం ఇవ్వకుంటే.. 50 కోట్ల పరువునష్టం దావా దాఖలు చేస్తామని రఘురామ హెచ్చరించారు. గతంలో కూడా సాక్షి టీవీ చానల్‌కు రఘురామ లీగల్‌ నోటీస్‌ ఇచ్చారు. రఘురామరాజు తరఫున న్యాయవాది పీవీజీ ఉమేశ్‌చంద్ర ఈ నోటీసు జారీ చేసిన విషయం తెలిసిందే. తన పరువు, ప్రతిష్ఠలకు భంగం కలిగించేలా తనకు […]

  • Publish Date - June 17, 2021 / 04:36 AM IST

విధాత,ఢిల్లీ: సాక్షి మీడియాకు ఎంపీ రఘురామకృష్ణరాజు లీగల్‌ నోటీసులిచ్చారు. తన ప్రతిష్టకు భంగం కలిగించినందుకు బేషరతు క్షమాపణ చెప్పాలని నోటీసులో పేర్కొన్నారు. పదిహేను రోజుల్లో నోటీసుకు సమధానం ఇవ్వకుంటే.. 50 కోట్ల పరువునష్టం దావా దాఖలు చేస్తామని రఘురామ హెచ్చరించారు.

గతంలో కూడా సాక్షి టీవీ చానల్‌కు రఘురామ లీగల్‌ నోటీస్‌ ఇచ్చారు. రఘురామరాజు తరఫున న్యాయవాది పీవీజీ ఉమేశ్‌చంద్ర ఈ నోటీసు జారీ చేసిన విషయం తెలిసిందే. తన పరువు, ప్రతిష్ఠలకు భంగం కలిగించేలా తనకు వ్యతిరేకంగా, న్యాయవిరుద్ధంగా అనేక కథనాలు ప్రసారం చేసినందుకు బేషరతుగా క్షమాపణలు చెప్పాలని, వారం రోజుల్లోగా స్పందించకుంటే చట్టపరమైన క్రిమినల్‌ చర్యలు తీసుకుంటానని పేర్కొన్నారు. ఇందిరా టెలివిజన్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ చైర్మన్‌ వైఎస్‌ భారతీరెడ్డి, పాలకవర్గం డైరెక్టర్లు, ఎడిటర్‌ ఇన్‌ చీఫ్‌ నేమాని భాస్కర్‌, కన్సల్టింగ్‌ ఎడిటర్‌ కొమ్మినేని శ్రీనివాసరావు పేర్లతో ఈ నోటీసు ఇచ్చారు. తన ప్రతిష్ఠకు భంగం కలిగించేలా ప్రసారం చేసిన కథనాలలో కొన్నింటిని ఉదహరించారు.