విధాత: తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిని పోలీసులు అరెస్టు చేశారు. ఇవాళ మధ్యాహ్నం నుంచి పట్టాభి నివాసం వద్ద వేచి ఉన్న పోలీసులు రాత్రి 9గంటల సమయంలో ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. తాళం పగులగొట్టి ఇంట్లోకి చొరబడి పట్టాభిని అరెస్టు చేశారు. కాలింగ్ బెల్కొట్టినా పట్టాభి తలుపు తీయలేదని అందుకే బలవంతంగా అరెస్టు చేయాల్సి వచ్చిందని పోలీసులు చెబుతున్నారు.పట్టాభిపై 153 a, 505(2), 504 R/W, 120b కింద కేసు నమోదు చేశారు.తన భర్తకు ఏం జరిగినా ప్రభుత్వానిదే బాధ్యతని పట్టాభి భార్య స్పష్టం చేశారు.
నిన్న సాయంత్రం వైకాపా మద్దతు దారులు పట్టాభి నివాసంపై దాడి చేసి వాహనాలు, ఇంట్లోని ఫర్నిచర్ ధ్వంసం చేసిన విషయం తెలిసిందే. సీఎం జగన్పై పట్టాభి అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ వైకాపా శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు దిగారు. నిన్న తెదేపా కార్యాలయాలపై దాడులకు పాల్పడ్డారు. సీఎంపై పట్టాభి అనుచిత వ్యాఖ్యలు చేశారని వైకాపా ఫిర్యాదు మేరకు విజయవాడ గవర్నర్పేట పోలీస్ స్టేషన్లో పట్టాభిపై కేసు నమోదైంది. అరెస్టు అనంతరం పట్టాభిని గవర్నర్ పేట పోలీస్ స్టేషన్కు తరలించారు