13న వైఎస్ఆర్ జీవిత సాఫల్య పురస్కారాలు ప్ర‌ధానం

విజ‌య‌వాడ‌లో సీయం పర్యటన ఏర్పాట్లు ప‌రిశీలించిన ప్ర‌భుత్వ స‌ల‌హాదారు, జిల్లా ఉన్న‌తాధికారులువిధాత:విజ‌య‌వాడ‌: ఈ నెల 13న వైఎస్ఆర్ జీవిత సాఫ్య‌ల పుర‌స్కారాలు ప్రధానోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి పాల్గొననున్న నేప‌ధ్యంలో విజ‌య‌వాడ‌ లబ్బిపేటలోని ఏ-1 కన్వెన్షన్ హాల్‌లో సంబంధిత ఏర్పాట్లను సోమవారం సాయంత్రం ముఖ్యమంత్రి కార్యక్రమాల సమన్వయకర్త తలశీల రఘురామ్, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు జివిడి కృష్ణమోహన్, సమాచార శాఖ కమిషనర్ విజయకుమార్ రెడ్డి, టూరిజం సిఇఓ విజయ్‌కృష్ణణ్‌, జిల్లా కలెక్టర్ జె.నివాస్, వీయంసి కమిషనర్ […]

  • Publish Date - August 9, 2021 / 04:17 PM IST

విజ‌య‌వాడ‌లో సీయం పర్యటన ఏర్పాట్లు ప‌రిశీలించిన ప్ర‌భుత్వ స‌ల‌హాదారు, జిల్లా ఉన్న‌తాధికారులు
విధాత:విజ‌య‌వాడ‌: ఈ నెల 13న వైఎస్ఆర్ జీవిత సాఫ్య‌ల పుర‌స్కారాలు ప్రధానోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి పాల్గొననున్న నేప‌ధ్యంలో విజ‌య‌వాడ‌ లబ్బిపేటలోని ఏ-1 కన్వెన్షన్ హాల్‌లో సంబంధిత ఏర్పాట్లను సోమవారం సాయంత్రం ముఖ్యమంత్రి కార్యక్రమాల సమన్వయకర్త తలశీల రఘురామ్, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు జివిడి కృష్ణమోహన్, సమాచార శాఖ కమిషనర్ విజయకుమార్ రెడ్డి, టూరిజం సిఇఓ విజయ్‌కృష్ణణ్‌, జిల్లా కలెక్టర్ జె.నివాస్, వీయంసి కమిషనర్ వి.ప్రసన్న వెంకటేష్, జాయింట్ కలెక్టర్ కె.మోహన్‌కుమార్, విజయవాడ సబ్ కలెక్టర్ జి.సూర్యసాయి ప్రవీణచంద్ తదితరులు పరిశీలించారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి పురస్కరించుకుని ప్రభుత్వం వివిధ రంగాల్లో సేవలు ప్రతిభ కనబరిచిన విశిష్ట వ్యక్తులకు ప్రకటించిన వైఎస్ఆర్ లైఫ్ టైం అచీవ్‌మెంట్ అవార్డులు ప్ర‌ధానం చేయ‌డం జరుగుతుందని అందుకు సంబంధించి ఏర్పాట్లను పటిష్టంగా చేయాలని తలశీల రఘురామ్, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు జివిడి కృష్ణమోహన్ చెప్పారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను వారు సమీక్షించారు.