సుప్రీంకోర్టు ఏ నిర్ణయం తీసుకున్నా.. ఆ ఆదేశాలను పాటిస్తాం… ఆదిమూలపు సురేష్

విధాత‌:ఏపీ, కేరళ రాష్ట్రాలపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిందనడం సరికాదు.పరీక్షలు ఎలా నిర్వహిస్తామన్నది స్పష్టంగా తెలియజేశామని వివరించిన మంత్రి సురేష్‌. గదికి 15 మంది విద్యార్థులు ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్లు నివేదించాం. విద్యార్థికి, విద్యార్థికీ మధ్య ఐదడుగుల భౌతికదూరం పాటిస్తూ కోవిడ్ ప్రోటోకాల్‌లను పాటిస్తూ పరీక్షలు నిర్వహిస్తామని న్యాయస్థానానికి తెలిపాం,ఎంసెట్ పరీక్షలకు సంబంధించి ఇంటర్ పరీక్షలను ఎలా పరిగణనలోకి తీసుకుంటామో కోర్టుకు వివరించాం.పదో తరగతిలో గ్రేడ్‌ల విషయంపైనా కోర్టుకు వివరాలను వెల్లడించినట్లు పేర్కొన్న మంత్రి. కేవలం గ్రేడ్‌లు […]

  • Publish Date - June 23, 2021 / 08:39 AM IST

విధాత‌:ఏపీ, కేరళ రాష్ట్రాలపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిందనడం సరికాదు.పరీక్షలు ఎలా నిర్వహిస్తామన్నది స్పష్టంగా తెలియజేశామని వివరించిన మంత్రి సురేష్‌. గదికి 15 మంది విద్యార్థులు ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్లు నివేదించాం.

విద్యార్థికి, విద్యార్థికీ మధ్య ఐదడుగుల భౌతికదూరం పాటిస్తూ కోవిడ్ ప్రోటోకాల్‌లను పాటిస్తూ పరీక్షలు నిర్వహిస్తామని న్యాయస్థానానికి తెలిపాం,ఎంసెట్ పరీక్షలకు సంబంధించి ఇంటర్ పరీక్షలను ఎలా పరిగణనలోకి తీసుకుంటామో కోర్టుకు వివరించాం.పదో తరగతిలో గ్రేడ్‌ల విషయంపైనా కోర్టుకు వివరాలను వెల్లడించినట్లు పేర్కొన్న మంత్రి.

కేవలం గ్రేడ్‌లు మాత్రమే ఇస్తున్నామని, మార్కులు కాదని సుప్రీంకోర్టుకు తెలిపామని, ఈ వివరాలన్నింటిని అఫిడవిట్ ద్వారా తెలపాలని కోరుతూ.. విచారణను గురువారానికి సుప్రీంకోర్టు వాయిదా వేసిందని స్పష్టం చేసిన మంత్రి… పరీక్షల విషయంలో సుప్రీంకోర్టు ఏ నిర్ణయం ప్రకటించినా పాటిస్తామని సురేష్ తెలిపారు.

Readmore:పరీక్షలపై సుప్రీంకోర్టులో జరిగింది ఇదీ?