విధాత: బిహార్ లోని బక్సర్ సమీపంలో బుధవారం రాత్రి నార్త్ ఈస్ట్ ఎక్స్ప్రెస్ పట్టాలు తప్పడంతో బోగీలు చెల్లాచెదురయ్యాయి.మొత్తం 21 కోచ్లు పట్టాలు తప్పినట్లు అధికారులు తెలిపారు.ఈ ఘటనలో నలుగురు మృతి చెందగా.. పలువురు గాయపడ్డారు.రెస్క్యూ సిబ్బంది సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి. నార్త్ ఈస్ట్ ఎక్స్ప్రెస్.. ఢిల్లీలోని ఆనంద్ విహార్ స్టేషన్ నుంచి గౌహతిలోని కామాఖ్య జంక్షన్కు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.