విధాత: నల్గొండ జిల్లా చిట్యాల మండలం పిట్టంపల్లి గ్రామంలో పసునూరి వెంకటేశ్వర్లు (57 )లక్ష్మి (48) దంపతులు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు.
అప్పుల బాధ నేపథ్యంలో వారు ఆత్మహత్యకు పాల్పడినట్లుగా భావిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.